DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సిబిఎస్ఈ ఫలితాల్లో సత్యసాయి స్కూల్లో అందరూ ఫస్ట్ క్లాసే

*టెన్త్ లో విశాఖ సత్యసాయి విద్యావిహార్ సరికొత్త రికార్డ్* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 16, 2020 (డిఎన్ఎస్):* సిబిఎస్ఈ నిర్వహించిన పదవ తరగతి పరీక్షల్లో విశాఖపట్నం ఎంవిపి కొలని లోనిశ్రీ సత్య సాయి విద్యా విహార్ స్కూల్, విద్యార్థులు నూరు శాతం ప్రధమ శ్రేణిలో

ఉత్తీర్ణతతో రాణించినట్టు సత్యసాయి సేవ సంస్థల రాష్ట్ర మీడియా కామన్వయకర్త ద్వారం స్వామి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు కష్ఠానికి, సత్యసాయి ఆశీస్సులు తోడవ్వడం తో మంచి ఫలితాలు సాధించడం జరిగిందన్నారు.  పదవ తరగతి పరీక్షా ఫలితాలకు హాజరైన వారందరూ ఫస్ట్ క్లాస్ లోనే పాసై 100% ఉత్తీర్ణతతో మరొక్కసారి తమ ప్రతిభను చాటి

చెప్పారన్నారు. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియచేసారు. 

పదవ తరగతి పరీక్షలకు హాజరైన మొత్తం 190 విద్యార్థులు  హాజరవగా అందరూ, అంటే 190 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు (100% విజయం).
 
1. మొత్తం 190  మంది విద్యార్థులు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు
2. 190  మందిలో 134   మంది విద్యార్థులు

డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులయ్యారు, అంటే> 75% కంటే ఎక్కువ మార్కులతో
3. 40  మంది విద్యార్థులు 90% -100% మధ్య మార్కులు సాధించారు
4. 68   మంది విద్యార్థులు 80% - 90% మధ్య మార్కులు సాధించారు
5.  56  మంది విద్యార్థులు 70% - 80% మధ్య మార్కులు సాధించారు
6    26  మంది విద్యార్థులు 60% - 70%  మధ్య మార్కులు సాధించారు
 
కందర్ప సాయి

సంజీవ్ హితేష్ , శ్రీమంతుల సాయి తన్మయి 97 .2 % మార్కులతో పాఠశాలలో స్కూలు లో అగ్ర స్థానం లో నిలిచారు.

కొండముది  స్థిత ప్రకీర్తి 96 .8 .% మార్కులతో, కాపు లిఖిత 96 % మార్కులతో రెండు మూడు స్థానాలో  నిలిచారు.
 
పాఠశాల కన్వీనర్ మరియు శ్రీ సత్య సాయి సేవా సంస్థల ఆంధ్ర ప్రదేశ్   రాష్ట్ర అధ్యక్షులు  ఎస్.జి.చలం,

 ప్రిన్సిపాల్ అయ్యగారి  కౌసల్య, మరియు పాలకమండలి సభ్యులు మరియు సిబ్బంది విద్యార్థుల  అద్భుతమైన ప్రతిభను  అభినందించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam