DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరి గోశాలలో 700 పళ్ళ మొక్కలతో ఆనందవనం

*DNS వార్తలకు స్పందనగా గోశాలలోనే వనం ఏర్పాటు* 

*సింహాచలం ఆలయ చైర్మన్ సంచయిత గజపతి వెల్లడి* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 17, 2020 (డిఎన్ఎస్):* తన తండ్రి ఆనంద గజపతి రాజు 70 వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని సింహాచలం కొత్త గోశాల లో 700 పళ్ళ మొక్కలతో ఆనందవనం

ఏర్పాటు చేస్తున్నట్టు సింహాచల దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు తెలిపారు. శుక్రవారం గోశాలను సందర్శించిన ఆమె అక్కడే 700 పళ్ళ మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మొక్కలతో తన తండ్రి పేరిట ఆనంద వనంగా తయారు చేస్తున్నట్టు తెలియచేసారు. ఈ మొక్కలను విజయనగరం కోట లో కూడా నాటడం

జరుగుతుందన్నారు.  

సింహాచలం గోశాల తరలించడానికి జరిగిన ప్రయత్నాలపై DNS మీడియా ద్వారా వచ్చిన వార్తలకు స్పందనగా గోశాలను తరలించే ప్రయత్నాలను రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశించిన విషయం తెలిసిందే. 

ఈ ఆదేశాలకు అనుగుణంగా సంచయిత శుక్రవారం సూర్యోదయం సమయానికే అడవివరం రోడ్డు

లోని కొత్త గోశాలను సందర్శించారు. అక్కడ ఉన్న గోవులతో కాసేపు ఆనందంగా గడిపారు. తమకు గోవులను చూస్తే ఎంతో ఆనందం, ఉత్సాహం కలుగుతోందన్నారు. ఇకపై గో సరంక్షణలో పూర్తి భాద్యత వహిస్తామన్నారు. అందుచేత తన తండ్రి 70 వ జన్మదినోత్సవం ( జులై 17 ) ను పురస్కరించుకుని 700 పళ్ళ మొక్కలతో ఆనందవనాన్ని ఈ గోశాలలోనే వనం ఏర్పాటు

చేస్తున్నామన్నారు. 

సూర్యోదయ కాంతులలో గోశాల నుంచే సింహగిరి ని దర్శించి ఆనందం పొందారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam