DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సోషల్ మీడియాలో రమణ దీక్షితులు చెప్పిన మాట వాస్తవమేనా?

*తిరుమల దర్శనాల నిలిపివేతకు అడ్డంకి ఈఓ, ఏ ఈఓ లేనా?*

*తిరుమల లో అర్చకుల అవస్థల పలు కారణమెవరు?*

*బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు డా. కెవివివి సత్యనారాయణ*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 17, 2020 (డిఎన్ఎస్):* ఇటీవల సోషల్ మీడియాలో తిరుమల తిరుపతి

దేవస్థానముల ఆగమ సలహాదారు, తాత్కాలిక అర్చకులు రమణ దీక్షితులు చెప్పిన మాటలు వాస్తవమేనా, కరోనా కట్టడి కోసం తిరుమల దర్శనాల నిలిపివేతకు అడ్డంకి ఈఓ, ఏ ఈఓ లేనా? వీటిల్లో వాస్తవమెంతో బహిర్గతం చెయ్యాలని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు డా. కెవివివి సత్యనారాయణ డిమాండ్ చేస్తున్నారు. 
గత కొన్ని రోజులుగా రమణ దీక్షితులు సోషల్

మీడియా లో ప్రకటిస్తున్న పోస్టుల ప్రకారం ఇప్పడికే తిరుమల ఆలయం లో పనిచేస్తున్న50 మంది అర్చకుల్లో 15 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, మరో 25 మంది పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు.  అర్చకులకు కరోనా పాజిటివ్ రావడం వెనుక ఎన్నో కారణాలు ఉండవచ్చన్నారు. అయితే 
ఈ సమయంలో భక్తులను కూడా ఆలయంలోకి అనుమతిస్తే ఈ వైరస్

మరింత విస్తరించే అవకాశం ఉన్నందున భక్తుల దర్శనాలను నిలిపివేయాలని అర్చకులు సూచించినట్టు తెలుస్తోంది. అర్చకుల సలహాను టిటిడి ఈఓ, ఏ ఈఓ లు తిరస్కరించారని దీక్షితులు సోషల్ మీడియా లో పోస్ట్ చేశారన్నారు. 

గతంలో చంద్రబాబు ప్రవేశ పెట్టిన వంశపారంపర్య అర్చక, బ్రాహ్మణా వ్యతిరేక పోలసీలను తూచా తప్పకుండా వీరు

పాటిస్తున్నారని, ఇదే కొనసాగితే తిరుమలలో పరిస్థితి శృతిమించిపోతుందని పోస్ట్ లో సారాంశం అన్నారు. తక్షణం వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారన్నారు. 

గతం వారం ప్రముఖ న్యాయవాది, ఎంపీ సుబ్రమణ్య స్వామి కి పంపిన మరో పోస్టులో సనాతన ధర్మాన్ని భ్రష్టుపట్టించే విధంగా రాష్ట్రంలో దేవాదాయ శాఖలో ఈఓ లో దురహంకార

పూరిత వైఖరితో ఆలయ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారన్నారు. ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాలు పరిరక్షించబడాలి అంటే రాష్ట్ర ప్రభుత్వ హస్తాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం సహా అన్ని దేవాలయాలనూ విముక్తి కల్గించాలని కోరుతున్నారు. అధికారుల దురహంకారం నుంచి ఆలయాలకు విముక్తి కల్గించాలని త్వరలోనే ఉద్యమం మొదలు పెట్టె

ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 

తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు నాలుగు దశాబ్దాల అర్చకత్వ అనుభవం ఉన్న రమణ దీక్షితులు ఈవిధంగా అభిప్రాయపడుతున్నారంటే. . ఇవి వాస్తవాలుగానే భావించాల్సిన ఆవశ్యకత ఉందని సత్యనారాయణ తెలిపారు. 

అర్చకులంటే అంత అలుసా: . . .

దీనికి అనుగుణంగానే ఆలయాలకు అత్యంత

ప్రధానమైన వ్యక్తి అర్చకుడేనని, ఆచారకుడు ఉంటేనే ఆలయానికి ఆదాయం వస్తుందన్నారు. ఆదాయం రాగానే ప్రభుత్వ అధికారులు అక్కడ వాలిపోతారని, అయితే అధికారులు, సిబ్బంది జీతాలు, రూ. 70 వేలకు పైగా ఉంటె. . ఆలయానికి అసలు కారణమైన అర్చకుని జీతం కనీసం రూ. 7 వేలు కూడా దాటడం లేదన్నారు. పైగా అర్చకులకు ఎవ్వరికీ పెన్షన్ లేదన్నారు. రోజంతా కష్టపడే

అర్చకులకు  కనీసం మర్యాద కూడా ఇవ్వక పోవడం ఈఓ ల దురహంకారానికి ప్రతీక గానే కనపడుతోందన్నారు. ఇదే తీరు కొనసాగితే ఆలయాలను ప్రభుత్వ కబంద హస్తాలను నుంచి విముక్తి కోరడం లో తప్పు లేదన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam