DNS Media | Latest News, Breaking News And Update In Telugu

22 న కొత్త ఎన్నికైన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 17, 2020 (డిఎన్ఎస్):* రాజ్యసభకు కొత్తగా ఎంపికైన సభ్యులు ఈనెల 22న ప్రమాణస్వీకారం చేస్తారు. గత పార్లమెంటు సమావేశాలు ముగిసి, తదుపరి సమావేశాలు ప్రారంభం కావడానికి మధ్య వ్యవధిలో సభ్యులు ప్రమాణస్వీకారం చేయనుండటం ఇదే మొదటిసారి. కోవిడ్ కారణంగా సామాజిక దూరంగా

పాటించాలనే నిబంధనలకు అనుగుణంగా హౌస్ ఛాంబర్‌లో కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం ఉంటుందని అధికారులు తెలిపారు.
సహజంగా సమావేశాలు జరిగుతుండగానో, సమావేశాలు లేనప్పుడు రాజ్యసభ చైర్మన్ ఛాంబర్‌లోనే కొత్త ఎంపీల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఇటీవల 20 రాష్ట్రాల నుంచి 61 మంది రాజ్యసభకు ఎన్నికయ్యారు. జూన్ 19న జరిగిన ఎన్నికల్లో

రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ రెండు సీట్లు గెలుచుకోగా, బీజేపీ ఒక సీటు గెలుచుకుంది. మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ రెండు సీట్లు, కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకున్నాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ నేత నీరజ్ డాంగి గెలుపొందగా, బీజేపీ నుంచి రాజేంద్ర గెహ్లాట్ ఎన్నికయ్యారు.

మధ్యప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థులు జ్యోతిరాదిత్య సింధియా, సుమెర్ సింగ్ సోలంకి, కాంగ్రెస్ నుంచి దిగ్విజయ్ సింగ్ గెలిచారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంది

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam