DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎస్సీ, ఎస్టీల సంక్షేమం ఖర్చులో ఆంధ్ర ప్రదేశ్ రికార్డు 

*ఆసరా, చేయూత ద్వారా మరింత లబ్ధి : సీఎం వైఎస్ జగన్* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 17, 2020 (డిఎన్ఎస్):* సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి 6వ సమావేశం శుక్రవారం జరిగింది. దీనిలో మంత్రులు పి.విశ్వరూప్, తానేటి వనిత, ధర్మాన

కృష్ణదాసు, ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని సహా వివిధ శాఖల సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీల కోసం చేసిన ఖర్చు వివరాలను అధికారులు సీఎంకు తెలియ చేసారు.  ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం సీఎం ఎనలేని కృషి చేశారని మంత్రులు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆయా వర్గాలకు మేలు

చేకూర్చారన్న మంత్రులు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాల ద్వారా అట్టడుగు వర్గాల వారికి ఎనలేని మేలు జరిగిందన్న మంత్రులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన మంత్రులు

ఎస్టీ, ఎస్సీల కోసం ఖర్చు ఇలా:

2018–19లో ఎస్సీల కోసం రూ.8,903.44 కోట్లు ఖర్చు, ఎస్టీల కోసం రూ.2,902.61 కోట్లు ఖర్చు 
2019–20లో

ఎస్సీల కోసం రూ.11,205.41 కోట్లు ఖర్చు, ఎస్టీల కోసం రూ.3,669.42 కోట్లు ఖర్చు 
ఈ ఏడాది (2020–21)కి సంబంధించి కొత్తగా అమలు చేయనున్న ఆసరా, చేయూత పథకాలతో కలిపి ఎస్సీల కోసం రూ.15,735 కోట్లు, ఎస్టీల కోసం రూ.5,177 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం

77,27,033 మంది ఎస్సీలకు, 24,55,286 మంది ఎస్టీలకు లబ్ధి
మొత్తంగా 1,01,82,319 మంది ఎస్సీ, ఎస్టీలకు

లబ్ధి

సమావేశంలో సీఎం ఏమన్నారంటే...:

– ఎస్సీ, ఎస్టీల కోసం అమలు చేసిన పథకాలు.. మన ప్రభుత్వం వచ్చాక అనేక కొత్త సంక్షేమ కార్యక్రమాలను తీసుకు వచ్చింది: సీఎం
– ఇప్పుడు జరుగుతున్న లబ్ధి అంతా ఆ పథకాల నుంచే:
– సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న పేదవాళ్లకి ఎంత మంచి జరిగితే అంత మంచిది:
– ఆసరా, చేయూత

పథకాలు ఈ ఏడాది కొత్తగా అమలు అవుతున్నాయి:
దీంతో ఎస్సీ, ఎస్టీలకు పెడుతున్న ఖర్చు మరింతగా పెరుగుతుంది:
– వైయస్సార్‌ ఆసరా కింద కనీసం 25లక్షల మహిళలకు లబ్ధి:
– వైయస్సార్‌ చేయూత కింద దాదాపు 90 లక్షల మహిళలకు లబ్ధి:
– ఈ పథకాల ద్వారా మహిళల ఆర్థిక స్తోమత పెరుగుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి:
– మహిళల స్వయం

సాధికారితకు ఈ రెండు పథకాలు ఉపయోగపడతాయి:
– రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి అమూల్‌తో ఈనెల 21న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్నాం:
– ఈ రంగం ద్వారా మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం:

2021 ఏప్రిల్‌ 14, అంబేడ్కర్‌ జయంతి నాటికి పార్కు నిర్మాణ లక్ష్యం: 

– అంబేడ్కర్‌

పార్కును వేగంగా పూర్తి చేయాలి: సీఎం
– అంబేడ్కర్‌ పార్కు పనులను రెండు విభాగాలుగా విభజించాలి:
– విగ్రహ నిర్మాణం, ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులను రెండుగా విభజించాలి:
– 20 ఎకరాల్లో విజయవాడ నగరం నడిబొడ్డున ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది:
– అద్భుతంగా, అందంగా, ఆహ్లాదంగా పార్కును తీర్చిదిద్దాలి:
– వచ్చే

ఏప్రిల్‌ 14 నాటికి పార్కు పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకోవాలి:
– మంత్రులు, అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పార్కు నిర్మాణం చేయించాలి: 
– విజయవాడ నగరం నడిబొడ్డున ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేయాలి:
– విజయవాడ నగరానికి పార్కు తలమానికం కావాలి:
– మంత్రులు, అధికారులు సవాల్‌గా తీసుకుని

అంబేడ్కర్‌ జయంతి నాటికి పూర్తయ్యేలా చూడాలి:
– వెంటనే సమావేశాలు ఏర్పాటు చేసుకుని కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలన్న సీఎం
– వీలైనంత కాంక్రీట్‌ నిర్మాణాలు తగ్గించి పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలి:
– విజయవాడ బ్యూటీని పెంచేందుకు ఈ పార్కు చాలా ఉపయోగపడుతుంది:

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam