DNS Media | Latest News, Breaking News And Update In Telugu

19 న తూగో జిల్లా లో జనజీవనం పై కర్ఫ్యూ తరహా ఆంక్షలు

*తూగో జిల్లా లో ఒక్క రోజే దాదాపు 1000 కరోనా కేసులు నమోదు*

*గుంటూరు జిల్లా లోనూ కఠిన తరమైన ఆంక్షలు అమలు*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 18, 2020 (డిఎన్ఎస్):* ఈ నెల 19 న ( ఆదివారం నాడు ) జిల్లా అంతటా కర్ఫ్యూ తరహా  విధిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్

రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. ఆదివారం ఉదయం 06 గంటల నుండి సోమవారం ఉదయం 06 గంటల వరకు కర్ఫ్యూ అమలులలో ఉంటుంది అని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ 24 గంటలు జిల్లా అంత పూర్తిగా కర్ఫ్యూ కొనసాగుతుందని ఏదైనా నా మెడికల్ ఎమర్జెన్సీ మాత్రమే అనుమతించటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ

చేశారు.

ఒక్క రోజే వెయ్యి పాజిటివ్ కేసులు: . . .

గత 24 గంటల కాలం లో తూర్పు గోదావరి జిల్లా మొత్తం దాదాపు 1000 పాజిటివ్ (ఉదయం 9 గంటల నాటికి 994 అధికారికంగా) కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో ప్రజల రాకపోకలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.  

19 నుంచి

గుంటూరు జిల్లాలోనూ కఠిన ఆంక్షలు..

ఆదివారం నుంచి రేపటి నుండి గుంటూరు జిల్లాలో కఠిన ఆంక్షలు అమలు లో ఉంటాయని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ తెలిపారు. ఉదయం  6 నుండి ఉ.9 వరుకు మూడుగంటలే రోడ్ల మీదకి అనుమతి ఉందన్నారు. నిత్యావసర సామాగ్రి షాపులు,  పళ్లుమార్కెట్, రైతు బజార్లు,   మార్కెట్ కి మాత్రమే ఉ.6 నుండి

9 వరుకు తెరిచి ఉంటాయన్నారు.  ఉదయం 4 నుండి ఉ. 8 వరుకు మిల్స్ & డైరి ప్రొడెక్ట్ అందుబాటులో ఉంటాయని, ఉ. 5 నుండి ఉ. 9 వరుకు ఏటీయం ఫిల్లింగ్ వెహికల్స్ కు అనుమతి ఉందన్నారు. ఉ. 7 నుండి సాయంత్రం 7  వరుకు టెక్ ఎ వే హోటల్స్ కు అనుమతి ఉందన్నారు. ప్రభుత్వ, పోలీస్, ఫైర్ ,ఎలక్ట్రసిటి, రెవిన్యూ ,  వీయంసీ , మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంటు

వెహికల్స్ కు మాత్రమే అనుమతి ఉందన్నారు. ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వెహికల్స్ కు,  ఆయిల్ & గ్యాస్ ఫిల్లింగ్ వెహికల్స్, మొబైల్ కమ్యునికేషన్స్ వెహికల్సు కు ప్రత్యేక అనుమతి ఉందన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam