DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి లో మహా దారుణం, బాలిక పై 9 మంది 4 రోజుల పాటు గ్యాంగ్ రేప్

*నాలుగు రోజుల పాటు ప్రత్యక్ష నరకం చూపిన 9 మంది దోషులు మైనర్లే*

*ఫోక్స్లో చట్టం ప్రకారం కేసు నమోదు:నార్త్ జోన్ డిఎస్పీ పీఎస్ఎన్ రావు *  

*దిశా చట్టం లో కేసులు పెడుతున్నారు, చర్యేలే లేవీ. . .*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 18, 2020 (డిఎన్ఎస్):* సభ్య సమాజం మొత్తం

తలదించుకునే విధంగా, అత్యంత దారుణమైన ఘటన రాజమహేంద్రవరం లో జరిగింది. ఒక మైనర్ (16 ఏళ్ళు లోపు) బాలిక పై 9 మంది దేశ ద్రిమ్మరులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. డిఎస్పీ పి ఎస్ ఎన్  రావు తెలిపిన వివరాల ప్రకారం . .. రాజమహేంద్రవరం శివారు ప్రాంతమైన మధురపూడి గ్రామానికి చెందిన ఒక బాలిక ఈనెల 12 వ తేదీ నుంచి కనపడడం లేదని

స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. విచారణ జరుగుతున్నా సమయం లోనే ఈ నెల 16 న బాలిక ఇంటికి వచ్చి తనపై తొమ్మిది మంది 
నాలుగు రోజుల పాటు ప్రవర్తించిన తీరు వెల్లడించి ఆక్రోశించింది. దీంతో పోలీస్ స్టేషన్ లో కేసుపెట్టి, నిందితులలో 7 గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం వెతుకుతున్నారు. వీటిలో ఇద్దరు ఆటో

కూడా నడుపుతున్నట్టు తెలిపారు. కాగా బాలిక తల్లిదండ్రులు రోజు కూలీలు. 

నాలుగు రోజుల పాటు మైనర్ బాలికకు నరకం చూపించి చివరికి పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్లిపోయారు.

ఈ ఘటన పై పూర్తీ వివరాలు చూస్తే ..రాజమండ్రి లో ఓ చెప్పుల దుకాణంలో సేల్స్ గర్ల్ గా పనిచేస్తున్న 16 ఏళ్ల బాలికపై కన్నేసిన కొందరు

కామాంధులు..ఆ బాలికపై నిఘా పెట్టి బలవంతంగా తీసుకెళ్లి ఓ గదిలో బంధించి దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు. ఒక్కొక్కరు పశువుల్లా ఆ అమ్మాయి మీద పడి పశు వాంఛ తీర్చుకున్నారు. ఆలా నాలుగు రోజులు ఆ అమ్మాయికి నరకం చూపించిన తరువాత కారులో తీసుకొచ్చి ఏకంగా పోలీస్ స్టేషన్ బయట వదిలిపెట్టి వెళ్లిపోవడం గమనార్హం.

ఇకపోతే

అమ్మాయి కనబడుట లేదు అని ఆమె తల్లిదండ్రులు ఐదు రోజుల కిందట కోరుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు సరిగ్గా స్పందించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఆ కామాంధులు ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే ఆ అమ్మాయిని దించేసి వెళ్లిపోవడంతో ఇందులో పోలిసుల పాత్ర కూడా ఉందని

స్థానికులు పోలీసులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

కేసులు పెడుతున్నారు, చర్యలే లేవు. . .

రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండాలని దిశ పోలీస్ స్టేషన్స్ ..దిశా చట్టం తెచ్చినా కూడా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టినా తదుపరి దోషులకు తగిన శిక్షలు పడక పోవడమే దీనికి కారణంగా

కనపడుతోంది. మహిళలకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ప్రచారం చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సైతం దోషులకు శిక్షలు పడక పోవడంతో దేశ ద్రిమ్మరులు రెచ్చిపోతున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam