DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వ్యవసాయరంగం లో ఇద్దరు ఆంధ్ర యువత కు జాతీయ పురస్కారాలు 

*ఆన్ లైన్ ద్వారా ఐ.సి.ఎ.ఆర్  వ్యవస్థకు దినోత్సవ వేడుకలు* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 18, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో వ్యవసాయ రంగం లో విశేష కృషి చేస్తున్న ఇద్దరికి భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ.సి.ఎ.ఆర్) జాతీయ పురస్కారాలు లభించాయి. న్యూ ఢిల్లీ నుంచి ఆన్

లైన్ ద్వారా జరిగిన  92వ వ్యవస్థాపక దినోత్సవాన్ని వేడుకల్లో వ్యవసాయ శాస్త్రవేత్తల కృషిని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అభినందించారు. వ్యవసాయ శాస్త్రవేత్తల కృషి కారణంగానే, గత 9దశాబ్దాల్లో దేశ వ్యవసాయ రంగానికి ఐ.సి.ఎ.ఆర్. ఎంతో  దోహదపడ గలిగిందని మంత్రి అన్నారు. శాస్త్రవేత్తల పరిశోధన,

రైతుల కష్టం కారణంగా దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి మిగులు స్థాయికి చేరిందని తోమర్ అన్నారు. కోవిడ్-19 వైరస్ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ రూపంలో ఇబ్బంది ఎదురైనా, రికార్డు స్థాయిలో పంటదిగుబడి సాధించిన రైతులోకానికి మంత్రి అభినందనలు తెలిపారు. దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్న వ్యవసాయ సంస్కరణలను తీసుకువచ్చిన ప్రధానమంత్రి

నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రైతులు ఆర్థిక సాధికారత సాధించి,  తమ పంటలకు గిట్టుబాటు ధరలు పొందేందుకు వీలు కలిగిస్తూ ప్రధాని చట్టచపరమైన సవరణలు, ఆర్డినెన్సులు ప్రకటించారని చెప్పారు. కాంట్రాక్ట్ వ్యవసాయం ప్రయోజనాలు చిన్న రైతులకు చేరేలా ఐ.సి.ఎ.ఆర్., కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలు తగిన కృషి చేయాలని ఆయన

సూచించారు.

 పూసా సంస్థగా పేరు పొందిన భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐ.ఎ.ఆర్.ఐ.) తన పదవ దశాబ్దిలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలని తోమర్ విజ్ఞప్తి చేశారు. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తిని పెంచాల్సి ఉందని, పప్పు ధాన్యాలు, నూనెగింజల దిగుబడిని కూడా

పెంచాల్సి ఉందని అన్నారు. పరిశోధన, సాగు విస్తీర్ణం పెంచడం ద్వారా పామాయిల్ ఉత్పత్తిని కూడా పెంచాలని అన్నారు. నూనెగింజల కొత్త వంగడాలను రూపొందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని, పప్పు ధాన్యాల దిగుబడిలో దాదాపుగా స్వయంసమృద్ధిని సాధించినట్టే, నూనె గింజల ఉత్పత్తిలో సాధించాలని, అప్పుడే వంటనూనెలను దిగుమతి చేసుకోవడం

తగ్గిపోతుందని మంత్రి సూచించారు.

  ఐ.సి.ఎ.ఆర్. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 8 కొత్త ఉత్పాదనలను, 10 ప్రచురణలను ఆవిష్కరించారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి పురుషోత్తం రూపాలా, ఐ.సి.ఎ.ఆర్. డైరెక్టర్ జనరల్ కైలాస్ చౌధరి, ఐ.సి.ఎ.ఆర్. సభ్యుడు త్రిలోచన్ మహాపాత్ర, ఇతర శాస్త్రవేత్తలు, అధికారులు ఈ కార్యక్రమంలో

పాల్గొన్నారు.

గిరిజన వ్యవసాయ విధానాల్లో విస్తృత పరిశోధనలు చేసినందుకు గాను విశాఖపట్నం జిల్లా కు చెందిన డాక్టర్ శివ కుమార్ కు ఫ్యాక్రుద్దీన్ అలీ అహ్మద్ అవార్డు లభించింది.  విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి లోని డా. వై ఎస్ ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిశోధన కేంద్రం లో విభాగాధిపతిగా విధులు

నిర్వహిస్తున్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన తెల్లం రమణ కు పండిట్ డీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ కృషి పురస్కారం లభించింది. 

అదే విధంగా వ్యవసాయ రంగంలోని వివిధ పరిశోధనలు, వ్యవసాయ విధానాలపై అనేక ప్రచురణలు, ప్రసారం చేసే ప్రసార మాధ్యమాలకు చౌదరి చరణ్ సింగ్ జాతీయ పురస్కారం అందించారు. ఈ విభాగం

లో  6 గురు పాత్రికేయులకు పురస్కారం లభించింది. ఈ విభాగం లో తెలుగు మాధ్యమం లో అమిర్నేని హరికృష్ణ కు పురస్కారం లభించింది. ఇదే రంగంలో గురుప్రీత్ సింగ్ నిబ్బేర్ కు జాతీయ పురస్కారం లభించింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam