DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత్ ఐటి రంగం లో తోలి మహిళా చైర్మన్ గా రోష్ని నాడార్ రికార్డ్

*దేశీయ ఐటి సంస్థ హెచ్ సిఎల్ చీఫ్ గా రోష్ని నాడార్ భాద్యతలు*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 18, 2020 (డిఎన్ఎస్):* భారతీయ ఐటి ప్రపంచంలో ఒక ఐటి సంస్థ కు మహిళా చైర్మన్ గా భాద్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు రోష్ని నాడార్. పూర్తి స్వదేశీ ఐటి సంస్థ హెచ్ సి ఎల్ టెక్నాలజీస్

చైర్ పర్సన్ గా రోష్ని నాడార్ మల్హోత్రా ఇటీవలే భాద్యతలు చేపట్టారు. ప్రపంచ ఐటి రంగ మార్కెట్ లో ధీటైన పోటీని అందిస్తున్న హెచ్ సి ఎల్ సంస్థ భారత ప్రధాని ఇచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ను గత నాలుగు దశాబ్దాల క్రితమే ప్రారంభించింది. భారతీయ ఐటి రంగంలో ఈ సంస్థ మూడవ స్థానం లో ఉంది. 38 సంవత్సరాల ఈ యువతి వ్యవస్థాపక చైర్మన్ శివ నాడార్

ఏకైక కుమార్తె. . . రోష్ని గత కొన్ని సంవత్సరాలుగా తన తండ్రి కి చేదోడు వాదోడుగా ఉండి, పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒప్పందాలు విజయవంతంగా సాధించగలిగారు. 
1976 లో ప్రారంభించిన ఈ సంస్థ చైర్మన్ పదవి నుంచి వైదొలగిన శివనాదర్  వ్యవహారాల ఇంచార్జి గా కొనసాగనున్నారు. 

2019 సంవత్సరానికి గాను

ప్రపంచంలో అత్యంత పవర్ ఫుల్ మహిళల్లో 54 వ స్థానంలో నిలిచారు రోష్ని. సంస్థ చే నిర్వహించబడుతున్న సామాజిక సేవ కార్యక్రమాల్లో అత్యంత చురుకుగా పాల్గొనే రోష్ని, త్వరలోనే వీటి సేవలను మరింతగా విస్తరించడం జరుగుతుందని ప్రకటించారు. 
ఉత్తర ప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో ప్రతిభావంతులకు అత్యున్నత విద్యను

అందించేందుకు గాను తన భర్త శిఖర్ మల్హోత్రా తో కలిసి 2018 లో ఒక ట్రస్ట్ ను కూడా నెలకొల్పారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam