DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమానుష ఘటనలో ఎవరినీ ఉపేక్షించేది లేదు : వాసిరెడ్డి పద్మ

*మైనర్ బాలిక అత్యాచారం పై పూర్తి విచారణ జరిపిస్తాం*

*మహిళా కమిషన్ బాధితురాలికి అండగా ఉంటుంది*

*రాజమండ్రి ఆసుపత్రిలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వెల్లడి.*

*DNS మీడియా వార్త కు కదిలి వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్*   

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్,

అమరావతి)*

*అమరావతి, జూలై 19, 2020 (డిఎన్ఎస్):* ఒక మైనర్ బాలిక పై తొమ్మిది మంది నాలుగు రోజులుగా జరిపిన అఘాయిత్యం ఘటన పై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ఆదివారం రాజమహేంద్రవరం లో బాలిక చికిత్స pondutunna జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి, ఆమెతో మాట్లాడారు. వైద్యులతో చర్చించి,

ఆమెకు పూర్తి ఆరోగ్యం లభించే విధంగా మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ ఈ అమానుష ఘటన కు కారణమైన వారెవ్వరినీ ఉపేక్షించేది లేదు తెలిపారు. 

ఇటీవల కోరుకొండ మండలానికి చెందిన మైనర్ బాలిక రాజమహేంద్రవరంలో అత్యాచారానికి గురై రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స

పొందుతున్న నేపథ్యంలో చైర్ పర్సన్ ఆ బాలికను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని,  బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి మహిళా కమిషన్ తరఫున భరోసా ఇచ్చారు. 

పేద కుటుంబానికి చెంది అతి కష్టం మీద పదవ తరగతి వరకు చదువుకొని, తన కుటుంబానికి సాయపడాలని చిన్న ఉద్యోగం చేసుకుంటున్నబాలికను చిత్రహింసలు పెట్టి,

 అత్యాచారానికి గురి చేయడం దారుణమన్నారు. ఈ కేసులో మహిళా కమిషన్ పూర్తి విచారణ జరిపిస్తుంది అన్నారు. ఆ కుటుంబానికి మహిళా కమిషన్ అండగా ఉంటుందన్నారు. అర్బన్ ఎస్పీ వారితో మాట్లాడి దోషులను కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దిశ చట్టం ద్వారా 21 రోజుల్లో దోషులకు శిక్ష పడే విధంగా కృషి చేస్తామన్నారు. ఇటువంటి

చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. 
బాధితురాలకు యథాప్రకారం ఐసిడిఎస్ ద్వారా నష్ట పరిహారం అందజేయడం జరుగుతుందన్నారు. 

చైర్ పర్సన్ తో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ శిరిగినీడి రాజ్యలక్ష్మి, సి డి పి ఓ సిహెచ్ వి నరసమ్మ, ఐ సి పి ఎస్ డి సి పి ఓ సిహెచ్

వెంకట్రావు లు పాల్గొన్నారు. 

DNS న్యూస్ మీడియా కు ప్రశంస..  

ఈనెల 16 న వెలుగు చూసిన ఇంతటి భయానక, అమానుష, అసాంఘిక ఘటనను మీడియా పరంగా తెలియచేసిన DNS న్యూస్ మీడియా ను ఆమె ప్రశంసించారు. బాధ్యతాయుతమైన సమాచారం అందించడం ద్వారా పేదలకు, బాధితులకు సత్వర ప్రభుత్వ అండ లభిస్తుందన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam