DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిలుకూరు ఆలయ పరిధి లో శివుని ఎదుట కూర్మావతారం ప్రత్యక్షం


*ఇది కోవిడ్ మహమ్మారి పై విజయానికి శుభ సంకేతం: అర్చకులు రంగరాజన్* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 19, 2020 (డిఎన్ఎస్):* చిలుకూరు బాలాజీ ఆలయ ప్రాంగణం లోని శివాలయం లోని గర్భాలయం లోకి ఒక కూర్మావతారం రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 
అతి త్వరలోనే కోవిడ్

మహమ్మారి పై విజయం సాధిస్తాం అని చెప్పేందుకు శుభ సంకేతం గా ఆదివారం ఉదయం తమ ఆలయంలో ప్రత్యక్ష నిదర్శం లభించింది అని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలియచేస్తున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, తమ ఆలయ ప్రాంగణం లోనే ఉన్న సుందరేశ్వర స్వామి ( శివాలయం) లోని గర్భాలయ మూర్తి ఎదుట ఆదివారం తెల్లవారుఝామున ఒక

కూర్మావతారం ( తాబేలు) దర్శనమివ్వడాన్ని అర్చకులు ఆశ్చర్యానికి గురయ్యారన్నారు. ఈ ఆలయంలోని తలుపులు మూసినా తర్వాత చిన్న జీవి కూడా ప్రవేశించే మార్గం లేదన్నారు. అభిషేకం జలం బయటకు వెళ్లేందుకు మాత్రమే చిన్న కన్నం ఉందన్నారు. ఆ కన్నం లో నుంచి ఇంత పెద్ద కూర్మావతారం ప్రవేశించే అవకాశం లేదన్నారు. 

సమస్త మానవాళిని

రక్షించేందుకు తాను ఉన్నాను అని స్వామి తెలియ చేసే అంశం ఇదేనన్నారు. తాబేలు రూపం ఎంతో ప్రాశస్త్యమైనదని, సాగర మధనాన్ని చేసినప్పుడు శ్రీమహావిష్ణువు కూర్మ రూపంలోనే అందరినీ రక్షించిన విషయం గుర్తు చేసారు. 

అర్చకులు ఆత్మారాం వివరణ:

దాదాపు పది సెంటీమీటరు పొడవు ఆరు సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ఈ తాబేలు

ఎలా ప్రవేశించిందో ఆశ్చర్యంగా ఉంది అని శివాలయం పూజారి సురేష్ ఆత్మారాం  తెలియజేశారు. భక్తులు చేసేటటువంటి ప్రార్థనలు డాక్టర్ల ప్రయత్నాలు ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు అన్నిటికీ తొందరలో మంచి ఫలితం లభిస్తుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam