DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా కాటుకు తిరుమల మాజీ ప్రధాన అర్చకులు బలి

*17 మంది అర్చకులు సహా 140 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్*.

*భక్తుల కోసం మరోసారి ద్వారాలు మూసే యోచన లో టిటిడి.*

టీటీడీ అధికారులతో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి టెలీకాన్ఫరెన్స్

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*తిరుమల /  విశాఖపట్నం, జూలై 20, 2020 (డిఎన్ఎస్):* తిరుమల తిరుపతి

దేవస్థానముల సంస్థను కరోనా కాఠిన్యం విస్తృతం చేస్తోంది. టిటిడి సిబ్బంది లో సుమారు 145 మందికి పాజిటివ్ రాగా, ఆలయ ప్రధాన నిర్వాహకులు, పర్యవేక్షకులు పెద్ద జీయర్ స్వామి కి పాజిటివ్ రావడంతో తిరుమల ఒక్కసారి విస్తుపోయింది. సాధారణంగా బయటవారిని అంత తొందరగా కలిసే అవకాశం లేని పెద్ద జీయర్ స్వామి సైతం దీని బారిన పడడం బాధాకరం అని

టిటిడి చైర్మన్ ఎస్ వి సుబ్బా రెడ్డి తెలిపారు. 

కరోనా బారిన పడిన శ్రీవారి మాజీ ప్రధాన అర్చకుడు శ్రీనివాస దీక్షితులు(75) ఈ ఉదయం స్విమ్స్ లో మరణించారు. వీరి కుమారుడు ప్రస్తుతం ఆలయం లో అర్చకులుగా పని చేస్తున్నారు. ఈయనకి కరోనా సోకింది. ఆయన నుండి శ్రీ శ్రీనివాస దీక్షితులు కి కూడా సోకింది.

ఒక సీనియర్

అర్చకునికి పరిస్థితి శృతిమించడంతో చెన్నై కి మెరుగైన వైద్యం కోసం తరలించారు. భక్తుల నుంచి అర్చకులు, సిబ్బందికి కరోనా వ్యాపించే అవకాశమే లేదని టిటిడి ప్రకటించింది. అయితే గతం లో మాదిరిగానే ఆలయాన్ని భక్తుల దర్శాన్ని నిలిపి వేసి, సేవలన్నీ ఏకాంతం లోనే నిర్వహించేందుకు చర్చలు జరుగుతున్నాయి. టీటీడీ అధికారులతో చైర్మన్

వైవీ సుబ్బారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam