DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాజీ ఎంపీ విశ్వనాధం ఆశీస్సులతో డా. సీదిరి ముందడుగు

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 20, 2020 (డిఎన్ఎస్):* ఈ నెల 22 న జరుగనున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో కొత్తగా ఇద్దరికి స్థానం లభించనున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లా పలాస శాసన సభ్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు పేరు ప్రముఖంగా వెలుగులోకి వచ్చింది. స్వతహాగా

వైద్యులు, సేవ తత్పరత కల్గిన వైద్యునిగా పేరు కూడా ఉండడంతో పాటు, ప్రజా ఆరోగ్య సమస్యలపై పూర్తి పట్టు కూడా ఉన్న వ్యక్తి గా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం ఈయన వైపు మ్రొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఇటీవలే ఇద్దరు ఎమ్మెల్సీ లు పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకట రమణ లు రాజ్య సభ కు ఎన్నికైన విషయం

తెలిసిందే. ఈ క్రమం లో వారు మంత్రి పదవులకు రాజీనామా చెయ్యాల్సిన అవసరం ఉంది. ఆ ఖాళీల్లో కొత్తగా ఇద్దరికీ అవకాశం వస్తుందన్న ఆశాభావంతో ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి చూపు ఎవరిపై పడితే వారికీ మంత్రి సింహాసనం దక్కుతుంది. 

డాక్టర్ సీదిరి పేరు దాదాపుగా ఖరారు అయినా నేపథ్యంలో ఆయన శ్రీకాకుళం మాజీ ఎంపీ

డాక్టర్ కణితి విశ్వనాధం ఆశీస్సులపై సోమవారం ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు పలు అంశాలపై చర్చలు జరిపారు. గత ఏడాది కాలంలో పలాస ప్రాంతంలో అప్పలరాజు నిర్వహించిన అభివృద్ధి పనులపై విశ్వనాధం అభినందనలు తెలియచేసారు. 

22 న జరుగనున్న క్యాబినెట్ విస్తరణలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యాలని

ముందుగానే ఆసిస్సులు అందించారు డాక్టర్ కణితి విశ్వనాథం

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam