DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం ఆపరేషన్ ముస్కాన్ లో 125 మంది గుర్తింపు: ఎస్పీ అమిత్ 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 20, 2020 (డిఎన్ఎస్):* వీధి బాలల గుర్తింపునకు చేపట్టిన "ఆపరేషన్‌ ముష్కాన్‌ కోవిడ్19" జిల్లాలో విజయవంతం గా జరిగిందని, మొత్తం 125 మంది గుర్తించినట్టు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్ తెలియచేసారు. సోమవారం అందించిన వివరాల ప్రకారం

శ్రీకాకుళం జిల్లాలో వారం రోజులుగా నిర్వహించిన ఆపరేషన్ ముష్కాన్ లో 125 మంది బాలల గుర్తింపు జరిగిందన్నారు. వారందరినీ ఆయా తల్లిదండ్రులకు అప్పగించామన్నారు.  కరోనా వేళ.. వీధి బాలలు, అనాధ మరియు నిరాదరణకు గురైన పిల్లల పరిరక్షణ మరియు కరోనా వైరస్ కు బారినపడకుండా  చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం జిల్లాలో

విజయవంతమయ్యిందని తెలిపారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 14 వ తేదీ నుండి సోమవారం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఎస్పీ అమిత్ బర్డర్ జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్ పరిధుల్లో నిర్వహించారు.  చదువుకోవాల్సిన వయసులో తల్లిదండ్రుల సంరక్షణ లేక రోడ్లపై తిరుగుతూ హోటళ్లు, రెస్టారెంట్‌లలో పనులు చేసుకుంటూ

రోడ్లపై పడుకోవడం, ఎక్కడపడితే అక్కడ తింటూ కాలం వెళ్లదీస్తున్న బాలల గుర్తింపునకు పోలీసులు వీధి వీధిన తిరిగి గుర్తించారు. కరోనా బారిన పడకుండా పరిరక్షణ చర్యలు చేపట్టారు. రైల్వేస్టేషన్లు, ఆర్టీసీబస్టాండ్లు, ఇటుక బట్టీలు, పరిశ్రమలో... ఇలా చాలా చోట్ల కార్మికులుగా మగ్గుతున్న బాలల కోసం పోలీసులు జల్లెడపట్టి విముక్తి

కల్పించారు. 

ఈ వారం డ్రైవ్‌ లో మొత్తం 125 మంది వీధి బాలలను గుర్తించారు. వీరిలో 86 మంది బాలలు, 39 బాలికలు కూడా ఉన్నారు. వీరు అందరూ జిల్లాలో వివిధ సబ్ డివిజన్ పరిధిలోని గుర్తించి వీరందర్ని కూడా ఆయా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కార్యక్రమం అదనపు ఎస్పీ పీ. సోమశేకర్ పర్యవేక్షణలో జరిగింది.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam