DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ జిల్లా ఆపరేషన్ ముస్కాన్ లో 59 మంది గుర్తింపు

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 20, 2020 (డిఎన్ఎస్):* గత వారం రోజుల పాటు విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా పోలీస్ బృందాలు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్ 19 లో మొత్తం 59 మంది బాలలని గుర్తించినట్టు విశాఖ జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు తెలిపారు. సోమవారం ముగిసిన ఈ ఆపరేషన్ లో 14 మంది

అనుమానాస్పద బాలురకు covid 19 స్వాబ్ టెస్ట్ లు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మొత్తం పోలీసులు గుర్తించిన వారిలో  44 మంది బాలురు, 15 మంది బాలికలు న్నారు. వారికి, తల్లిదండ్రులకు కౌన్సలింగ్ చేసి ఇళ్లకు పంపారు. 
విశాఖపట్నం జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు పర్యవేక్షణలో  జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో జరిగిన

“ఆపరేషన్ ముస్కాన్”  సోమవారంతో  ముగిసింది.

(జూలై 14 నుండి జూలై 20 వరకు) వారం రోజుల పాటు జరిగిన ఆపరేషన్ ముస్కాన్ లో  రైల్వే స్టేషన్ లు, బస్ స్టాండ్ లు,  హోటల్ లు, డాబాలు, ఇతర గ్యారేజీలు, ఇతర వర్క్ షాపులలో బాల కార్మికులుగా మార్చబడిన మొత్తం 44 మంది  బాలురు , 15 మంది బాలికలను  పోలీసులు రెస్క్యూ చేసి వారిని ICDS,

జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ  సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి  వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam