DNS Media | Latest News, Breaking News And Update In Telugu

127 ఏళ్ల సెయింట్ జోసెఫ్ గర్ల్ స్ స్కూల్ చరిత్ర చెరిగిపోయింది 

*ICSE లో 97% మార్కులు  ను తిరగరాసిన పదో తరగతి విద్యార్థిని*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 21, 2020 (డిఎన్ఎస్):* ఐసిఎస్ఈ  పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నగరం లోని సెయింట్ జోసెఫ్ గర్ల్ స్  హై స్కూల్, జ్ఞానాపురం విద్యార్థిని  97 శాతం మార్కులు సాధించడంతో 127 ఏళ్ళ చరిత్ర చెరిగి

పోయింది. ఈ ఏడాది మార్చి లో జరిగిన పదో తరగతి ICSE విభాగంలో జీ. యోచన ప్రీతి అనే బాలిక 600 మార్కులకు గాను 582 (97%) మార్కులు సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంతవరకూ  96% శాతం మార్కులు ఈ స్కూల్ రికార్డ్ గా ఉండేది. ప్రీతి తండ్రి జీ.వి. మహేష్ కుమార్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఉద్యోగి. 
పోర్ట్ ఉద్యోగి కుమార్తె 10 తరగతి పరీక్షల్లో

అత్యధిక మార్కులు సాధించడం పట్ల పోర్ట్ డెప్యూటీ చైర్మన్ పి.ఎల్. హరనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరింత ప్రతిభ చూపి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన బాలికను దీవించారు. స్కూల్ యాజమాన్యం యోచన ప్రీతి ప్రతిభ పై హర్షం వ్యక్తం చేసింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam