DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కార్గిల్ లో శ్రీకాకుళం కు చెందిన ఆర్మీ అధికారి వీర మరణం

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 20, 2020 (డిఎన్ఎస్):* కార్గిల్‌లో బాంబులు నిర్వీర్యం చేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదం లో శ్రీకాకుళానికి చెందిన ఒక యువ ఆర్మీ అధికారి వీర మరణం పొంది దేశ సేవకు అంకితమైనట్టు తెలుస్తోంది. వీరు శ్రీకాకుళం నగరం హడ్కో కాలనీకి చెందిన నివాసి.

కార్గిల్ లో  ముష్కరులు పెట్టిన బాంబులు గుర్తించి నిర్వీర్యం చేసే క్రమంలో.. ఒక బాంబు పేలడంతో తీవ్రంగా గాయపడి ఈయన వీరమరణం చెందారు. యుద్ధభూమిలో సిక్కోలు వీరుడు నేలకొరిగాడు. దేశ రక్షణ కోసం పాటు పడుతూ ప్రాణాలు అర్పించారు. పదిహేడేళ్ల కిందట ఆర్మీలో చేరిన ఈ అధికారి ఎందరో యువకులకు ప్రేరణగా నిలిచారు. బాంబులు నిరీర్యం చేసే

పనిలో బిజీగా ఉన్నానని ఉదయమే భార్యాబిడ్డలకు గర్వంగా చెప్పారు. అలా చెప్పిన కొన్నిగంటలకే ఆ వీరుడి అస్తమయం జరిగింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam