DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇప్పుడు ఉన్న కార్పొరేషన్లే  ఉపయోగపడడం లేదు, కొత్తవి ఎందుకు?

*బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు 25 కోట్లు వెనక్కి ఎందుకు వెళ్లాయి?*

*రాష్ట్రం అప్పులలో ఉండగా కొత్తవాటికి నిధులు ఎలా ఇస్తారు ?* 

*చైర్మన్ తప్ప బ్రాహ్మణ కార్పొరేషన్ కు మరో మనిషి లేరు. .*

కశ్యప, భారతి  స్కీంల నిధులు లబ్దిదారులకు ఏడాది దాటినా చేరలేదు: . ..

*రాష్ట్ర బిజెపి కార్యవర్గ

సభ్యులు డాక్టర్ కె.వి వి వి సత్యనారాయణ.*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 21, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆర్ధికంగా అప్పుల్లో ఉన్నందున ఇంతవరకూ ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ వంటివి జనానికి ఏమాత్రం ఉపయోగ పడడం లేదని రాష్ట్ర బిజెపి కార్యవర్గ

సభ్యులు డాక్టర్ కె.వి వి వి సత్యనారాయణ ఎద్దేవా చేసారు. బ్రాహ్మణ కార్పొరేషన్ పనితీరు సరిగ్గా లేకపోవడంతోనే దానికి కేటాయించిన నిధుల్లో రూ. 25 కోట్లను అమ్మఒడి పథకానికోసం వెనక్కి తీసేసుకున్నారన్నారు. దీనికి కారణం బ్రాహ్మణ కార్పొరేషన్ లో ప్రస్తుతం కేవలం చైర్మన్ గ మల్లాది విష్ణు ( విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే) మాత్రమే

ఉన్నారని, అటు కమిటీ డైరక్టర్లు గాని,  కార్యాలయంలో సిబ్బంది కానీ, జిల్లాల్లో ప్రతినిధులు కానీ ఎవ్వరూ లేరన్నారు. 

కశ్యప, భారతి  స్కీంల నిధులు లబ్దిదారులకు ఏడాది దాటినా చేరలేదు: . ..

వేలాదిమంది వృద్ధ బ్రాహ్మణులూ పింఛను కోసం కశ్యప స్కీం లో దరఖాస్తు చేసుకున్నారని, విద్యార్థులు భారతి స్కీం కు

దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరిలో కశ్యప స్కీం కు నెలల తరబడి పెన్షన్ ( ఇచ్చేది కేవలం 2 వేలు మాత్రమే) కూడా రావడం లేదన్నారు. ఇక చదువుకునే పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఇచ్చే భారతి స్కీం గత ఏడాది ఎవ్వరికి విడుదల కాలేదన్నారు. 

దీంతో మల్లాది విష్ణు నిధులను ఏడాది కాలం నుంచి పూర్తిగా మురగబెట్టారన్నారు. దీంతో

ప్రభుత్వం ఆ నిధులను తమ అవసరాల కోసం వెనక్కి తీసేసుకుందన్నారు. 

ఇది కేవలం బ్రాహ్మణ కార్పొరేషన్ కు మాత్రమే పరిమితం కాదని, ఇతర కార్పొరేషన్ లు కూడా ఇంచుమించుగా ఇదే వైఖరి తో ఉన్నాయన్నారు. లబ్దిదారులకు రిక్తహస్తాలు చూపిస్తున్నాయన్నారు. 

ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాటినే ఉద్దరించేలేకపోతున్న

తరుణంలో ఇక కొత్త కార్పొరేషన్లు పెట్టి ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. ఒకపక్క రుణభారం విపరీతంగా పెరిగిపోతున్న కట్టడి చేయకుండా, ప్రభుత్వం అనవసరంగా 52  కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రం మీద తీవ్రమైన ఆర్థిక భారం ఏర్పడుతుందని విమర్శించారు.

కొత్తవి ఏర్పాటు చేయడం వల్ల ఇవి కేవలం రాజకీయ నిరుద్యోగులకు

ఆర్థిక వెసులుబాటు గా మాత్రమే ఉంటాయని ఆయన తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam