DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా పాజిటివ్ వస్తే ఆందోళన వద్దు: కలెక్టర్ మురళీధర్ రెడ్డి

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 21, 2020 (డిఎన్ఎస్):* కోవిద్ 19 పాజిటివ్ వలన ఆందోళన  చెందనవసరం లేదని, ధైర్యంగా ఉండాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ రాజానగరం జిఎస్ఎల్ హాస్పటల్ లో కోవిద్ 19 విభాగాలను జాయింట్ కలెక్టర్ రాజకుమారి,

రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ అభిషి క్త్ కిషోర్ తో కలిసి పరిశీలించి అక్కడ జరుగుతున్న కోవిద్ 19 పాజిటివ్ పేషెంట్లకు వైద్యం, ఆహార సదుపాయాల గురించి ఆరా తీశారు. కలెక్టర్ మరియు జేసీలు పి పి ఈ కిట్టు ధరించి పాజిటివ్ కేసులు వారి దగ్గరకు వెళ్లి, వైద్య సదుపాయాలు పై ఆరాధిస్తూ ఎటువంటి భయాందోళనలు పడవద్దని

ప్రభుత్వం నుండి అన్ని విధాల వైద్య సదుపాయాలు అందుతాయని పేషెంట్లకు భరోసా ఇచ్చారు. డాక్టర్లు సిబ్బందితో సమావేశం నిర్వహించి ఎప్పటికప్పుడు కావలసిన పరికరాలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని కోవిద్ విభాగాలను పరిశీలించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam