DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేవాదాయ శాఖా నిధులు ప్రభుత్వ స్కీంలకు ఎలా తరలిస్తారు?

*అమ్మఒడి కి ఇచ్చిన రూ. 25 కోట్లు వెనక్కి ఇవ్వాల్సిందే. . .*

*భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 21, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ (దేవాదాయ శాఖ అనుబంధం) నుంచి అమ్మఒడి పథకానికి మళ్లించిన సుమారు రూ. 25

కోట్ల  నిధులను తిరిగి బ్రాహ్మణ కార్పొరేషన్ కు జమ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి భారతీయ జనతా పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు.  దేవాదాయ శాఖ ఉండేది హిందూ ఆలయాల పరిరక్షణ కోసమేనన్నారు. అలాంటిది దేవాదాయ శాఖ నిధులు వేరే పథకాలకు ఎలా వాడతారని లేఖలో ప్రశ్నించారు. దేవాదాయ శాఖ

నుంచి అమ్మఒడి పథకానికి నిధులు మళ్లింపుపై భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు.  
ఈ కార్పొరేషన్ నుంచి నిధులను తరలించడం ద్వారా నిరుపేద బ్రాహ్మణులకు అన్యాయం చేసినట్టేనన్నారు. వృద్యాప్య పింఛను, వివిధ తరహాల విద్యార్థి ఉపకార వెతకాలను ఈ కార్పొరేషన్ ద్వారా అందించడం జరుగుతుందన్నారు.

నిధుల లేమి కారణంగా గత ఏడాది నుంచి ఎవ్వరికి ఈ లబ్ది అందలేదన్నారు. 
దేవాదాయ శాఖ ఉండేది హిందూ ఆలయాల పరిరక్షణ కోసమేనన్నారు.  అలాంటిది దేవాదాయ శాఖ నిధులు వేరే పథకాలకు ఎలా ఉపయోగిస్తారని లేఖలో ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. అమ్మఒడి పథకానికి మళ్లించి

24కోట్లు 25 లక్షల 75వేల రూపాయలు తక్షణమే దేవాదాయశాఖకు చెల్లించాలని డిమాండ్ చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam