DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రూ.6,900 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక ప్రతిపాదనలు

*Rs 6900 Cr Sklm annual budget plan ratified by banks* 

*రూ.6,900 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక ఆమోదం*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 21, 2020 (డిఎన్ఎస్):*  శ్రీకాకుళం జిల్లా వార్షిక రుణ ప్రణాళికను రూ.6,900 కోట్లతో ఆమోదించారు.  2020 - 2021 ఆర్థిక సంవత్సరానికి నాబార్డు, జిల్లా లీడ్ బ్యాంకు సంయుక్తంగా

తయారు చేసిన రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ జె నివాస్ మంగళవారం ఆవిష్కరించారు. యూనియన్ బ్యాంకు అనుబంధ సంస్ధలు ఆర్ సెటి, నైరెడ్ సంస్థల వార్షిక నివేదికలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగింది. వార్షిక రుణ ప్రణాళికలో పంట రుణాలకు రూ.2960 కోట్లు,

ఎం.ఎస్.ఎం.ఇ కి రూ.890 కోట్లు, వ్యవసాయ పెట్టుబడుల రుణాలుగా రూ.1214 కోట్లు, ఎక్స్ పోర్ట్ క్రెడిట్ గా కోటి రూపాయలు, ఇతర అంశాలకు రూ.650 కోట్లు కేటాయింపు చేసారు. ప్రాధాన్యత రంగాలకు రూ.5715 కోట్లు, ప్రాధాన్యతేతర రంగాలకు రూ.1185 కోట్లు. గత ఏడాది నిర్దేశించిన రూ.6874 కోట్ల రుణ లక్ష్యంలో రూ.5916 కోట్లు రుణాలుగా అందించి లక్ష్యంలో 86 శాతం సాధించడం

జరిగింది.  ఇందులో ప్రాధాన్యత రంగానికి రూ.3916 కోట్లు అందించడం జరిగింది. 

జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ వీధి బళ్ల వ్యాపారులకు రుణాలను ఆత్మ నిర్బర్ భారత్ క్రింద అందించాలన్నారు. ఏ ఒక్కరూ తప్పి పోరాదని, మెప్మా పూర్తి స్థాయిలో సర్వే చేయాలన్నారు. రుణాలను సరళంగా మంజూరు చేయాలని ప్రభుత్వ ఆలోచన ఉందన్నారు.

తదనుగుణంగా రుణాలు మంజూరు చేయాలన్నారు. వలసలు వెళ్ళిన వారిలో జిల్లాకు 60 వేల మంది తిరిగి వచ్చారని తెలిపారు. వారికి రుణాలు మంజూరు చేయడం వలన పంటల పెట్టుబడిగా ఉపయోగం ఉండాలన్నారు.  కిసాన్ క్రెడిట్ కార్డ్ దారులకు రుణాలు అందించాలని, మత్స్య రంగంలో రుణాలు మంజూరు చేయాలి. ఐటిడిఏ ప్రాంతంలో దృష్టి సారించాలన్నారు. స్వయం సహాయక

సంఘాలకు రుణాలు అందించాలి. కోవిడ్ పరీక్షల సామర్ధ్యం రోజుకు 4 వేలకు పెంపు చేశారన్నారు. వారం రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. 

లీడ్ బ్యాంకు మేనేజర్ జివిబిడి హరిప్రసాద్ మాట్లాడుతూ ఎస్ హెచ్ జి లకు కోవిడ్ రుణాలుగా రూ.5 వేలు అందించవచ్చని ఆదేశాలు ఉన్నాయి. ఆత్మ నిర్బర్ భారత్ క్రింద ఇప్పటి వరకు 2204 మందితో

జాబితా తెలిపారు. 

కార్యక్రమం లో  జిల్లా బ్యాంకర్ల సమావేశం కన్వీనర్ మరియు యూనియన్ బ్యాంకు రీజనల్ మేనేజర్ పి.కృష్ణయ్య, నాబార్డు డిడిఎం మిలిన్డ్ చౌసాల్కర్, ఎస్బీఐ ఆర్ఎం ఏవిఎస్ఎస్ ప్రసాద్, ఆర్సెటి డైరెక్టర్ ఎస్.బి.శ్రీనివాస్, డిసిసిబి సిఇఓ డి.సత్యనారాయణ, ఎపిఙివిబి ఆర్.ఎం మహమ్మద్ రియాజ్, నైరెడ్ డైరెక్టర్

ఎం.కృష్ణ మూర్తి, బ్యాంకు ఆఫ్ బరోడా అధికారి రాజేంద్రప్రసాద్, లీడ్ బ్యాంక్ ఎఫ్.ఎల్.సి కె. గిరిజా శంకర్, వ్యవసాయ శాఖ జెడి కె. శ్రీధర్, పశుసంవర్ధక శాఖ జెడి ఏ.ఈశ్వర రావు, బిసి కార్పొరేషన్ ఇడి జి.రాజారావు, మెప్మా పిడి ఎం.కిరణ్ కుమార్,చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు డా.పద్మ తదితరులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam