DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విద్వేషాలు పెంచే ప్రసారాలు చేస్తే కఠిన చర్యలు: టీవీ చానెళ్లకు హెచ్చరిక

విద్వేషాలు పెంచే ప్రసారాలు చేస్తే à°•à° à°¿à°¨ చర్యలు: టీవీ చానెళ్లకు పోలీసు హెచ్చరిక 

హైదరాబాద్‌, జులై 12 ,2018 (DNS Online ) : టిఆర్ పీ రేటింగ్ à°² కోసం టీవీ చానళ్ళు చేస్తున్న

ప్రసారాలు, కధనాలు, చర్చలు ఫలితంగా సమాజానికి మంచి కన్నా చెడు ఎక్కువగా జారుతోందని, ఇక అటువంటి ప్రసారాలు చేస్తే ఆయా టీవీ ఛానెళ్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని

తెలంగాణా ప్రభుత్వం హెచ్చరించింది. ఇటీవల కాలం లో విదేశీ మత సంస్థలకు అమ్ముడు పోయిన కొన్ని టీవీ యాజమాన్యాలు హిందూ మతాన్ని కించపరిచే విధంగా ప్రసారం

 à°ªà±à°°à°¸à°¾à°°à°¾à°²à± చేసి సమాజం లో ప్రజలను భయభ్రాంతుల్ని చేస్తుండంతో à°ˆ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పడికే ఆయా టీవీ చానెళ్లకు పోలీసు అధికారులు

హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. ఒక టీవీ ఛానెల్ అదే పనిగా హిందువులను కించపరుస్తూ, ప్రకటనలు, స్లోగన్లు, ప్రతి పది నిమిషాలకోసారి విద్వేష పూరిత ప్రసారాలు చేయడంతో

పాటు, కొందరు వ్యక్తులతో పదే పదే విద్వేష ప్రసంగాలు, వ్యాఖ్యలు చేయిస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. దీనిపై గతంలోనే ఆయా టీవీ యాజమాన్యాలను

హెచ్చరించినా ఫలితం లేకపోవడం తో కఠిన చర్యలకు సిద్దపడుతున్నట్టు తెలియచేసారు. ప్రసార మాధ్యమాలు సమాజాన్ని మంచి మార్గంలో పెట్టేలా ఉండేలా ఉండాలి తప్ప, తప్పుడు

ప్రసారాలతో ప్రజలను భయభ్రాంతులని చేస్తున్నాయన్నారు. 

మతపర సున్నిత అంశాల విషయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే ఐపీసీలోని ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు

చేస్తున్నారో అదే చట్టాల ప్రకారమే టీవీ ఛానెళ్లపై చర్యలు ఉంటాయన్నారు. 

శ్రీ పీఠం నిర్వాహకులు స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు

పాదయాత్రకు సిద్దపడడానికి ప్రధాన కారణం ఇటీవల à°“ టీవీ చానల్‌లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో శ్రీ రాముడిపై కత్తి మహేశ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే. à°† చర్చ

జరిగింది ఒక్కసారే. అయితే అతని వ్యాఖ్యలని సదరు టీవీ ఛానెల్ పదే పదే ప్రసారం చేసి, ప్రజలను రెచ్చగొట్టిందని పలు  à°§à°¾à°°à±à°®à°¿à°• సంఘాలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలోనూ ఫిర్యాదు చేసి, వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరడంతో తెలంగాణ ప్రభుత్వం టీవీ చానెళ్లకు

హెచ్చరికలు జారీ చేసింది.

డీజీపీ సూచనల మేరకు వార్తా చానళ్ల ప్రసారాలను నిరంతరం సమీక్షించడానికి హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనరేట్‌లో ప్రత్యేక విభాగం

ఏర్పాటు చేశారు. ఇక పై ఎటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసారాలు చేసిన ఆ టీవీ ఛానెల్ ను తక్షణం మూసివేయడమే కాక, నిర్వాహకులు, పాల్గొన్నవారిపై ( ప్రయోక్తలతో సహా

) చట్ట రీత్యా à°•à° à°¿à°¨ చర్యలు తప్పవు అని తెలుస్తోంది.   

గత వారం రోజులుగా జరిగిన పరిణామాల్లో ఆధ్యాత్మిక బంధువులు మానసికంగా ఇబ్బంది పడినా, ఈ వివాదాస్పద, విప్లవ

టీవీ ఛానెళ్ల పై కఠిన చర్యలు తీసుకోవడం శుభపరిణామంగా మారింది. ఇదే తరహా చర్యలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా చేపట్టాలని, తద్వారా కొన్ని అసాంఘిక సంస్థల

కార్యకలాపాలకు బ్రేక్ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam