DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ ను తిరిగి నియమించండి

*రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్‌ బిశ్వభూషణ్ సూచన. . .*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 22, 2020 (డిఎన్ఎస్):*  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తిరిగి నియమించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ లేఖ

పంపారు. హైకోర్టు ఆదేశం మేరకు ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని ఆదేశించారు. హైకోర్టు తీర్పు, ఆదేశాలను వెంటనే అమలు చేయాలని ప్రధాన కార్యదర్శకి పంపిన లేఖలో గవర్నర్‌ తెలిపారు.

నిమ్మగడ్డ విజ్ఞప్తి పై స్పందించిన రాజ్‍భవన్ 

రమేష్ కుమార్ విజ్ఞప్తిని పరిశీలించి ఎస్‍ఈసీగా నియమించాల్సిందిగా

ప్రభుత్వానికి గవర్నర్ సూచించినట్లు సమాచారం.  హైకోర్టు తీర్పును అమలు చేయాలని ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశం జారీచేసినట్టు తెలుస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వకపోవడంతో పాత స్థానాన్ని పునరుద్ధరించాల్సిందిగా నిమ్మగడ్డ కోరారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam