DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రాన్ని పచ్చతోరణం, ఆనందమయంగా మారుద్దాం.  .

*వనమహోత్సవంలో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం.*

*ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటి, పర్యావరణాన్ని రక్షిద్దాం.*

*వన మహోత్సవం ప్రారంభంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్.*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 22, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ ను పచ్చతోరణమయంగా తీర్చిదిద్ది

ప్రజల జీవితాలను ఆనందమయంగా మారుద్దామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 71వ వన మహోత్సవం కార్యక్రమంలో  భాగంగా జగనన్న పచ్చతోరణంను ముఖ్యమంత్రి జగన్ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం గాజులపేటలో ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మొక్కలను నాటి, మంచి కార్యక్రమానికి

ఆరంభాన్ని ఇచ్చారు. ఈ సందర్బంగా సీఎం అందరితో ప్రతిజ్ఞ‌ చేయించారు. ఈ వనమహోత్సవంలో 20 కోట్ల మొక్కలు నాటడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.  ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి జగన్. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. 

ఇక రాష్ట్రవ్యాప్తంగా 30

లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. గాజులపేటలో 33 ఎకరాల లేఅవుట్‌ చేసి, 1600 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఎకరా కనీసం రూ.3 కోట్లు ఉంటుందన్న ఆయన, చదరపు గజం విలువ రూ.5 వేలు అని తెలిపారు. అంత మంది పేదలకు ఇళ్ల స్థలం ఇవ్వడం, వారు తమ ఇంటి స్థలం వద్ద చక్కగా చెట్లు నాటడం చూస్తే ఆనందం

వేస్తోందని చెప్పారు.

ఆగస్టు 15న పట్టాల పంపిణీ : . .. 

ఆగస్టు 15న రాష్ట్రమంతా 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వగలుగుతామని అనుకుంటున్నాం. రాష్ట్రమంతా 1.48 కోట్ల ఇళ్లు ఉంటే, ఇప్పుడు 30 లక్షల కుటుంబాలకు ఇంటి స్థలం ఇస్తున్నాం అంటే దాదాపు 20 శాతం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

90 రోజుల్లో

ఇస్తాం

అర్హులెవరైనా మిగిలిపోతే, గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. రాష్ట్రమంతా దాదాపు 13 వేల గ్రామ పంచాయితీలు ఉంటే, 17 వేల లేఅవుట్లు చేసి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని సీఎం వివరించారు.
ఆ తర్వాత మొక్కలు నాటడంపై అందరితో ప్రమాణం చేయించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam