DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్ర మంత్రి వర్గంలో ఇద్దరు కొత్తవారికి అవకాశం

*ప్రమాణ స్వీకారం చేసిన డా. సీదిరి, చెల్లుబోయిన* 

*మంత్రిగా విశాఖ కెజిహెచ్ వైద్యుడు, పీజీలో గోల్డ్ మెడలిస్ట్* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 22, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరు కొత్త వారితో రాష్ట్ర

మంత్రివర్గాన్ని విస్తరించారు. బుధవారం రాష్ట్ర రాజ్  భవన్ లో సాదాసీదాగా జరిగిన కార్యక్రమం లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వెంకట రమణ లతో  ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం

జగన్​తోపాటు సభాపతి తమ్మినేని సీతారాం, మండలి ఛైర్మన్ షరీఫ్‌ హాజరయ్యారు.

కరోనా వ్యాప్తి దృష్ట్యా అతి కొద్ది మందితోనే ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్, సభాపతి తమ్మినేని సీతారాం, శాసన మండలి ఛైర్మన్ షరీఫ్‌, మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న ఎమ్మెల్యేల

కుటుంబసభ్యులు మాత్రమే కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్ర మంత్రిగా కెజిహెచ్ వైద్యుడు సీదిరి 

రాష్ట్ర మంత్రిగా బుధవారం ప్రమాణం చేసిన శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఉత్తరాంధ్ర జిల్లాల ఆరోగ్య దాయిని కింగ్ జార్జ్ ఆసుపత్రి లో వైద్యునిగా ఏడాది కాలం సేవలు అందించారు.

కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల లో ఎంబిబిఎస్ లో బంగారు పతకం పొందిన సీదిరి, విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కళాశాల నుంచి పీజీ లో సైతం బంగారు పతకం పొందారు. అనంతరం ఒక ఏడాది కాలం అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విశాఖ కె జి హెచ్ లో వైద్యునిగా సేవలు అందించారు.  

1995 లో పదో తరగతిలో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించి నాటి సీఎం

చంద్రబాబు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన మూడేళ్లకే సీదిరికి మంత్రి పదవి వరించింది. 

రాజోలు నుంచి వచ్చి రామచంద్రపురం ఎమ్మెల్యే గా. . మంత్రిగా 

మరో మంత్రిగా ప్రమాణం చేసిన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గం శంకరగుప్తం శివారు అడవిపాలెం నివాసి. 

తొలిసారి కాకినాడ గ్రామీణంలో ఓడిపోయినా, 2019 లో రామచంద్రపురం నుంచి గెలిచి ఇప్పుడు మంత్రి పదవి చేపడుతున్నారు.  2001లో రాజోలు జడ్పీటీసీ సభ్యునిగా గెలిచి తొలి రాజకీయ విజయం అందుకున్నారు. తదుపరి 2006లో మలికిపురం జడ్పీటీసీ

సభ్యునిగా గెలిచి, జిల్లా పరిషత్‌ అధ్యక్షుడయ్యారు. 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ గ్రామీణ నియోజకవర్గ సమన్వయకర్తగా 2014లో అక్కడే వైకాపా తరఫున పోటీచేసి స్వల్పతేడాతో ఓడిపోయారు. 

2019 లో రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి జిల్లాలోనే అత్యంత బలవంతమైన అభ్యర్థి తోట త్రిమూర్తులు ( నాలుగుసార్లు

ఎమ్మెల్యే ) పై విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌ బాక్సింగ్‌ సంఘ అధ్యక్షునిగా కూడా పనిచేస్తున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam