DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర లో కరోనా కట్టడి లో వైఎస్ జగన్ ప్రభుత్వం వైఫల్యం

*జర్నలిస్ట్ లను ఫ్రంట్ లైన్ వారియర్ల జాబితాలో చేర్చాలి* 

*పగో జిల్లా టిడిపి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 22, 2020 (డిఎన్ఎస్):* కరోనా కట్టడి లో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని మాజీ ఎంపీ, టీడీపీ పశ్చిమ

గోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఘాటుగా విమర్శించారు. కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు ప్రభుత్వం ఒక్క ప్రయత్నం కూడా చెయ్యక పోవడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితి పై ఆమె స్పందించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏపీ లో మార్చి 21 నాటికి కేవలం 5 కేసులు మాత్రమే ఉంటె జులై 21

నాటికి 58 వేలు కు చేరుకోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి కారణంగానే దేశంలోనే కేసుల పెరుగుదల లో రెండవ స్థానం లోను, మరణాల్లో నాల్గవ స్థానంలో చేరుకుందన్నారు. భాద్యతారాహిత్య వ్యాఖ్యల వలన ప్రజలు నిర్లక్షంగా వ్యవహరిస్తురన్నారు. పారాసిటమాల్, బ్లీచింగ్ తో పోతుందని, కరోనా తో సహా జీవనం

చెయ్యాలి లాంటి వ్యాఖ్యలతో ప్రజలు సందిగ్ధం లోకి వెళ్లారన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో బాధ్యతారాహిత్యం 3 లక్షల శాంపిల్స్ వృధా చేశారన్నారు. పాజిటివ్ వచ్చినా, నెగటివ్ అని, బ్రతికి ఉన్నప్పుడు నెగటివ్ అని, చనిపోయాక పాజిటివ్ అని తప్పుడు నివేదికలు ఇవ్వడం దారుణం అన్నారు. లాక్ డౌన్ సమయం నుంచి నేటి వరకూ అధికార పార్టీ నాయకులు

కరోనా వాహకులుగా మారారన్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఏమాత్రం పాటించకుండా అధికార పలుకుబడిని పూర్తిగా వినియోగించుకుని కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందించారన్నారు. ప్రజలకు వైద్యం చేసే ఆంధ్ర ప్రదేశ్ ఆసుపత్రులు . .వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులకు పనికిరాలేదని, ఈ ఆసుపత్రుల్లో జరుగుతున్న చికిత్స మీద

వారెవ్వరికీ నమ్మకం లేనందునే పొరుగు రాష్ట్రమైన హైద్రాబాద్ కు వెళ్లి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం కోసం చేరుతున్నారన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అత్యంత కీలక నేత సహా అగ్ర నేతలంతా హైద్రాబాద్ లోనే చికిత్స చేయించుకుని ఆంధ్ర ప్రదేశ్ లోని వైద్య విభాగాన్ని అవమానించారన్నారు. 

కరోనా తో సామాన్యుల ఆర్ధిక

పరిస్థితి దిగజారితే కేంద్ర ప్రకటించిన రూ. 1000  మినహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా సాయం అందలేదన్నారు. 
ఆఖరికి కరోనా కిట్ ల లోనూ అవినీతి అని, ఒక్క గుంటూరు లోనే రూ. 75 కోట్ల బ్లీచింగ్ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. ప్రతి ఒక్కరికీ 3 మాస్క్లు పధకం హామీ ఏమైందన్నారు. 5 కోట్ల మందికి 15 కోట్ల మాస్కులు ఇచ్చారా లేదా

అని ప్రశ్నించారు. క్వారంటైన్ కేంద్రాలు నరక కూపాలుగా మారాయని, వసతి అత్యంత దుర్భరంగా ఉందన్నారు. ప్రజల్లో అవగాహనా పెంచాల్సింది పోయి. మద్యం దుకాణాలను విపరీతం గా తెరిచి ప్రజల కొంపలు ఆర్పేశారన్నారు. తద్వారా కరోనా వ్యాప్తికి కోరలు తెప్పించారన్నారు. 

ఉపాధి కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి రూ. 10 వేలు ఆర్థిక సాయం

చెయ్యాలని, కరోనా విధుల్లో మరణించిన ఫ్రంట్ లైన్ వారియర్ల కుటుంబాలకి రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసారు. 

పాత్రికేయులను ఫ్రంట్ లైన్ వారియర్ల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేసారు. వారు బలైతే వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు.  కరోనా మహమ్మారి అంతరించే వరకూ రాష్ట్ర వ్యాప్తంగా

విద్యుత్ బిల్లులు రద్దు చెయ్యాలని డిమాండ్ చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam