DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏ ఆర్ మైదానం లో వన మహోత్సవం లో ఎస్పీ అమిత్ బర్డర్

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 22, 2020 (డిఎన్ఎస్):* బుధవారం నాడు జిల్లా పోలీసు ఆర్ముడ్ రిజర్వుడ్ కార్యాలయ మైదనంలో జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్, 71వ వనమహోవాత్సం కార్యక్రమంలో భాగంగా  పోలీసు అధికారులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పర్యావరణ పరిరక్షణలో

భాగంగా ఆంధ్ర ప్రదేశ్ పచ్చదనంతో కళకళలాడేలా చేయాలని, సస్యశ్యామలమైన వాతావరణాన్ని ప్రజలందరికీ అందించాలనే లక్ష్యంతో  రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన మేరకు నేటి నుండి "జగనన్న పచ్చ తోరణం" కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించడం జరిగింది.

ముఖ్యమంత్రి నినాదం మేరకు శ్రీకాకుళం

జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్ జిల్లా పోలీసు ఏ ఆర్ కార్యాలయ మైదనంలో పోలీస్ అధికారులతో కలిసి మొక్కలు నాటి  జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భావి భారతానికి మనం అందించే ఆస్తి ఏదైనా ఉంది అంటే అది ఆహ్లాదకరమైన వాతావరణం తో కూడిన పర్యావరణ మేనని, అది చెట్ల వల్ల మాత్రమే

సాధ్యం అవుతుందని, చెట్లను పెంచడం వాటిని సంరక్షించడం మన అందరి బాధ్యత అని, కనుక ప్రతి ఒక్కరూ  మొక్కలు నాటి వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో  అదనపు ఎస్పీ పి. సోమశేఖర్ (పరిపాలనా), ట్రాఫిక్ డిఎస్పి సీహెచ్. జి.వి ప్రసాదు, అర్ఐ లు ప్ర దీ కుమార్, ఉమా శంకర్, 2 టౌన్ సిఐ రమణ, ఎచ్చెర్ల

ఎస్ఐ రాజేష్ లు ఎస్ఐ లు, ఆర్ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam