DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రంలో సజ్జనార్ మార్కు పోలీస్ పాలన వస్తేనే మహిళలకు రక్షణ

*బాధిత బాలికకు మాజీ మంత్రి పీతల సుజాత పరామర్శ*   

*ఇసుక దందాను ప్రశ్నిస్తే శిరోముండనం చేస్తారా? మాజీ మంత్రి మండిపాటు* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 23, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలకు, దళితులకు రక్షణ లేదని, పాలనా గాడిలో పడాలంటే సజ్జనార్ మార్కు పోలీస్

పాలన ఉండాలని మాజీ మంత్రి పీతల సుజాత డిమాండ్ చేసారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని  మధురపూడి గ్రామానికి చెందిన మైనర్ బాలికను ఆమె పరామర్శించారు. ఈమె కు జరిగిన అన్యాయం అత్యంత దారుణమన్నారు. దీనికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ బాడీలైన వారందరినీ ఉరి తియ్యాలని డిమాండ్ చేసారు. ఈ మైనర్ బాలికను మభ్యపెట్టి, మోసం

చేసి ఇంతమంది మృగాళ్లకు బలి పెట్టిన మహిళపై ఏమి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. పోలీస్ విభాగాన్ని అత్యంత బలహీనంగా మార్చేశారన్నారు. 

ప్రశ్నిస్తే శిక్షిస్తారా? . . .

అదే తూర్పు గోదావరి జిల్లా సీతానగరం లోని ఇసుక దందాలను ప్రశ్నించిన ఒక దళిత యువకున్ని పోలీస్ స్టేషన్ లోనే ఘోరంగా అవమానించి,

శిరోముండనం చేసిన ఘటనలో బాధితున్ని ఆమె పరశించారు. ఈ సందర్బంగా జరిగిన విషయాన్నీ తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియా తో మాట్లాడుతూ సీతానగరం లోని అధికారపార్టీకి చెందిన నేతలు 
ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్న ఇసుక దందాలను కేవలం ప్రశ్నించిన కారణంగానే అక్రమదారులకు చెందిన రవాణా బృందాలు నిర్లజ్జగా దూషించడం, భౌతికంగా దాడి

చెయ్యడమే కాక, అతని పై సీతానగరం పోలీస్ స్టేషన్ లో తప్పుడు ఫిర్యాదు చేసి, అక్రమ విధానంలో పోలీస్ ల చే శిరోముండనం చేయించడం నీచ పాలనకు నిదర్శనంగా ఉందన్నారు. ఈ ఘటనలో ఒక ఎస్ ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసారని, ఇంతకీ దోషులపై చర్యలు తీసుకోలేదన్నారు. 

ఈమె వెంట మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక తెలుగుదేశం

నాయకులూ పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam