DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పంట నిల్వ కోసం ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజి

*రూ.4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం* 

*గోదాములు, కోల్ట్ స్టోరేజిలపై సీఎం జగన్ సమీక్ష*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 23, 2020 (డిఎన్ఎస్):* రాష్ట్రంలో రైతుల కోసం గోదాములు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం కోసం రూ.4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్ కు దన్నుగా

నిలుస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం నిర్వహించిన సమీక్ష లో  వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రైతులు తమ పంట నిల్వ చేసుకునేందుకు వీలుగా ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజి నిర్మించాలని భావిస్తున్నామని తెలిపారు. తన వద్ద పంట ఉందన్న విషయం రైతు ఆర్బీకే (రైతు

భరోసా కేంద్రం) అధికారులకు తెలిపితే ఆ విషయం వెంటనే సెంట్రల్ సర్వర్ కు చేరాలని స్పష్టం చేశారు. రైతు తన పంటను అమ్ముకునేలా మార్కెటింగ్ శాఖ తోడ్పాటునివ్వాలని అన్నారు. కనీస గిట్టుబాటు ధర లేని పక్షంలో ధరల స్థిరీకరణ నిధితో రైతులను ఆదుకోవాలని సూచించారు. సెప్టెంబరు నాటికి దీనికి సంబంధించిన సాఫ్ట్ వేర్ రూపొందించాలని సీఎం

జగన్ ఆదేశించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam