DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి వైద్యుల నిర్లక్ష్యమే జర్నలిస్టును బలికొంది

*వైద్యం అందక పాత్రికేయుని కోల్పోడం బాధాకరం.* 

*బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు డా. కెవివి సత్యనారాయణ* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 23, 2020 (డిఎన్ఎస్):* సరైన సమయంలో వైద్యం అందానికరణంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్ర వరం గ్రామీణ విలేకరి (టీవీ 5 ) సుంకరి

రామారావు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. కెవివివి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే విశాఖ లో DNS తో మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నిరోధంలో ప్రత్యక్ష పోరాటం చేస్తున్న పాత్రికేయులకు ప్రభుత్వం నుంచి సహకారం లభించక పోవడం దారుణమన్నారు. అందునా

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలో ఉన్న సమయంలో కనీసం ఆక్సిజన్ కూడా అందించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. కేంద్ర ప్రభుత్వం పాత్రికేయులకు తగిన రక్షణ కల్పించాల్సిన భాద్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపిన విషయాన్నీ వివరించారు. గత కొన్ని నెలలుగా పాత్రికేయులకు రక్షణ కల్పించామని బీజేపీ ప్రభుత్వాన్ని

డిమాండ్ చేసినా పట్టింపులేదన్నారు. 

ఈ ఘటనలో ప్రభుత్వ ఆసుపత్రుల వైఫల్యం పూర్తిగా కనిపించిందన్నారు. సాక్షాత్తు పాత్రికేయులు చికిత్స కోసం వచ్చిన సిబ్బంది ఖాతరు చేయలేదంటే. . సామాన్యులకు ఈ వైద్యులు, సిబ్బంది ఏ తరహా లో సేవలు అందిస్తున్నారో తెలుస్తోందని మండిపడ్డారు. ఈ ఘటనకు ఆసుపత్రి వైద్యులు, యంత్రాంగాన్ని

భాద్యుల్ని చేయాలన్నారు. 

పాత్రికేయుని కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నట్టు తెలిపారు. విధుల్లో ఉండే పాత్రికేయులు తమ ఆరోగ్యం పట్ల చాల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam