DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహోన్నతం. .కాఠిన్యపు విధుల్లో వెల్లువిరిసిన మానవత్వం

*కరోనా మృతునికి అంత్యక్రియలు చేసిన ఎసై, స్వచ్ఛ కార్యకర్తలు* 

*నాగాయలంక ఎసై కృష్ణ కు సర్వత్రా అభినందనలు.*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 24, 2020 (డిఎన్ఎస్):* నిత్యం విధి నిర్వహణలో కర్కశత్వం గా, నిక్కచ్చిగా విధులు నిర్వహించే పోలీసులు తమలోని మానవత్వాన్ని

ప్రపంచానికి చాటి తాము అందరి అంచనాలకు మించిన మహోన్నతులం అని చాటుకున్నారు. 

కృష్ణ జిల్లా నాగాయలంక గ్రామం లో కరోనా తో మృతి చెందిన ఒక వ్యక్తి ని కరోనా భయంతో మృతదేహానికి అంత్యక్రియలు కుటుంబసభ్యులు వదిలేయడంతో పోలీస్ సిబ్బంది రంగం లోకి దిగారు.  
నాగాయలంక ఎస్ ఐ చల్లా కృష్ణ ధైర్యం చేసి ముందుకు రావడంతో

గ్రామా స్వచ్ఛ నాగాయలంక కార్యకర్తలు తలశిల రఘుశేఖర్, నారాయణ, డి.టీ సుబ్బారావు లు కలిసి ఎవరు ముట్టుకోవడానికి సాహసించని మృతదేహాన్ని ఇంటి నుండి బయటకు తీసుకుని వచ్చి, స్మశాననికి తీసుకుని వెళ్లి స్వయంగా అంతిమ సంస్కారాలు నిర్వహించి గొప్ప మనసు చాటుకున్నారు.  పీపీఈ కిట్ లు ధరించి, తాము నిజమైన ప్రజా సేవకులం అని

ప్రకటించారు. 

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో లాక్ డౌన్ సమయంలో పోలీసులు పాత్ర ఎనలేనిది. నేడు ప్రస్తుతం కరోనా మృతులకు అంత్యక్రియలను సైతం నిర్వహించి తమ  ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. 

అనంతరం ఎసై మాట్లాడుతూ . .. 

నిన్నటి వరకూ మనతో కలిసి మెలిసి తిరిగిన వారు

మరణిస్తే అనాధలుగా వదిలి వెయ్యదాం బాధాకరం అన్నారు. అనాధ ప్రేత దహనం ఎంతో ఉన్నతమైనదని, వారికి సంస్కారం చేయడం ఒక భాద్యతగా భావించినట్టు తెలిపారు. కరోనా పట్ల అవగాహనా కల్గి యుండి, జాగ్రత్త గా ఉండాలి తప్ప, బాధితులను వేలి వెయ్యరాదన్నారు. 

మానవతావాదులకు సర్వత్రా అభినందనలు 

ఎసై కృష్ణ, స్వచ్ఛ

కార్యకర్తలు చేసిన మహోన్నత మైన అంతిమ సంస్కారానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. మానవత్వం చూపి, అంతిమ సంస్కారాలు నిర్వహించిన నాగాయలంక ఎస్ ఐ చల్లా కృష్ణను, స్వచ్ఛ నాగాయలంక సభ్యులను అందరూ అభినందిస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam