DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాత్రికేయులకు ప్రభుత్వం సహకారం అందించాలి :

*ఆసుపత్రిలో వైద్యం అందక జర్నలిస్ట్ ని కోల్పోవడం బాధాకరం* 

*రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 24, 2020 (డిఎన్ఎస్):* కరోనా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న పాత్రికేయులను అన్ని విధాలా

ఆదుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రాజమహేంద్రవరం రూరల్ విలేకరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరి, వైద్యం అందక ప్రాణం కోల్పోవడం చాలాబాధాకరం అన్నారు. ఈ మేరకు ఆమె ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు. కరోనా బారిన పడి సరైన వైద్యం అందక, ఆక్సిజన్

లేక సీనియర్ పాత్రికేయుడు సుంకర రామారావు మృతి చెందటం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పాత్రికేయులు కరోనా బారిన పడి చనిపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో  సుంకర రామారావు పడుతున్న బాధని చూసి స్థానిక పాత్రికేయులు అధికారుల

దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం పని చేస్తున్న పాత్రికేయుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. 
మీడియా సిబ్బందిని  వెంటనే  కరోనా వారియర్స్ జాబితాలో చేర్చాలని, వారికి కరోనా బీమా పథకాన్ని వెంటనే  అమలు చేయాలని

డిమాండ్ చేశారు. కోవిడ్ ఆస్పత్రులలో వెంటనే  సదుపాయాలను మెరుగు పరచాలని ఆమె సూచించారు. 
విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్ లకు సమాచార శాఖ ద్వారా పిపిఈ కిట్లు  అందజేయ్యాలని, కరోనాతో మృతి చెందిన  జర్నలిస్ట్ ల కుటుంబాలకు  50 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని, గత మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న  వర్కింగ్

జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, వర్కింగ్ జర్నలిస్ట్ ప్రమాద బీమా పథకాల ఫైల్ ను వెంటనే క్లియర్ చేసి పాత్రికేయులకు వైద్య, ఆరోగ్య భద్రత కల్పించాల ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam