DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జర్నలిస్టులకు వైద్య పరంగా పూర్తి సదుపాయాలు అందిస్తాం

*ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 24, 2020 (డిఎన్ఎస్):* రాష్ట్రంలో కరోనా మహమ్మారి ని నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న కృషి లో భాగస్వామ్యం అవుతున్న జర్నలిస్ట్ లకు పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి

అదేశం చేశారని, ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. 

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడిన జర్నలిస్ట్ లకు మెరుగైన వైద్యం అందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆళ్ల నాని ఆదేశాలు జారీ చేసారు. 

కరోనా సోకిన జర్నలిస్ట్ లకు

ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని, జర్నలిస్ట్ లకు బీమా సౌకర్యం కల్పించే విషయం లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలలో కరోనా సోకిన జర్నలిస్ట్లు వెంటనే క్వారంటైన్ కు తరలించి మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. ఎక్కడైనా జర్నలిస్ట్ లకు కరోనా  పాజిటివ్ వస్తే వెంటనే సమాచారం

ఇవ్వాలని సూచించారు. 

అలాంటి వారిని వెంటనే క్వారంటైన్ కి పంపించడానికి చర్యలు చేపడతామన్నారు. 

జర్నలిస్ట్లు అధైర్య పడవద్దు : . . . . . 

క్వారంటైన్ సెంటర్లలో అన్ని సదుపాయం కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అదేశాలు ఇచ్చామన్నారు. క్వారంటైన్ సెంటర్స్ లో కరోనా బాధితులకు భోజనం...

శానిటేషన్... బ్రేక్ ఫాస్ట్... ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం అని తెలిపారు.  
క్రిటికల్ కేర్ చికిత్స కు అధనంగా 2380 బెడ్లు  అందుబాటులోకి వస్తాయని తెలిపారు.  

వచ్చే 6నెలల్లో అధనంగా 1000కోట్లు ఖర్చు చేస్తాం అని ప్రకటించారు. కోవిడ్ పరీక్షలు.. క్వారంటైన్ సదుపాయం కోసం ప్రభుత్వం రోజుకి రూ. 6.5కోట్లు

చొప్పున ఖర్చు చేస్తుందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam