DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సర్వజన ఆసుపత్రి సందర్శించిన జిల్లా కలెక్టర్

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 24, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం లోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో కోవిడ్ విభాగాన్ని జిల్లా కలెక్టర్ జె నివాస్ శుక్రవారం పరిశీలించారు. ఆసుపత్రిలో కంట్రోల్ రూమ్ ను సందర్శించారు. కంట్రోల్ రూమ్ నుండి కోవిడ్ వ్యాధిగ్రస్తులకు వైద్య చికిత్స

అందుతున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. కంట్రోల్ రూమ్ తో ప్రతి అంశాన్ని అనుసంధానం చేయాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం వైద్యులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. సర్వజన ఆసుపత్రి లో రెండు బ్లాకులు కరోనా వ్యాధిగ్రస్తులకు కేటాయించడం జరిగిందని అన్నారు. ప్రతి బెడ్ కు ఆక్సిజన్ సరఫరా జరగాలని ఆయన పేర్కొన్నారు. ఆక్సిజన్ కొరత

సమస్య లేకుండా ముందస్తు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. కోవిడ్ పేషెంట్లు పాటించాల్సిన నియమ నిబంధనలను స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమయానుసారం అందించాల్సిన మందులు, పాటించాల్సిన అంశాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. కరోనాపై భయం తొలగించాలని, ధైర్యంగా ఉండాలని సూచించాలని తద్వారా త్వరగా కోలుకొని

బయటకు రాగలరని స్పష్టం చేశారు. అందరూ వైద్యులు సమన్వయంతో పనిచేయాలని, ఎటువంటి అజాగ్రత్త ఉండకూడదని ఆదేశించారు. అన్ని మందులు సిద్ధంగా  ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. 

లక్షణాలు కనిపించగానే పరీక్షలకు : 

లక్షణాలు కనిపించగానే పరీక్షలకు రావాలని కలెక్టర్ నివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లక్షణాలు

వచ్చినప్పటికీ ఇంట్లోనే ఉండటం తద్వారా సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. ఈ పరిస్థితి లో మార్పు రావాలని చెప్పారు. వివక్ష చూపిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వివక్ష చూపిస్తారని ముందుకు రాకుండా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam