DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంచలన సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన రెబెల్ ఎంపీ 

*అభివృద్ధి పనులకు సిఎంకి బదులు కేంద్ర మంత్రికి ఆహ్వానం* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 25, 2020 (డిఎన్ఎస్):* ఏపీ రాజకీయాల్లో ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలనంగా మారారు. రాష్ట్రం పరిధిలో నిర్వహించే అబివృద్ధి, ప్రారంబోత్సవాలు చేయడానికి సీఎంకు పెద్దపీట వేస్తారు. ఒకవేళ సీఎం

రానీ పక్షంలో ఆ జిల్లాలో మంత్రి ఉంటే ఆయన చేతులు మీదుగా... లేకుంటే జిల్లా ఇన్‌చార్జ్ మంత్రితో ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. నర్సాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు రఘురామకృష్ణంరాజు

ఆహ్వానం పంపారు. నర్సాపూర్‌ అసెంబ్లీ పరిధిలోని మైనపువాని లంకలో నిర్మలా సీతారామన్‌ కేటాయించిన 4 కోట్ల రూపాయల నిధులతో భవనాలు నిర్మించారు.

అయితే ఈ భవనాల ప్రారంభానికి ఆమెను ఆహ్వానించారు. అక్టోబర్ నెలలో ఒక రోజు నియోజకవర్గంలో పర్యటించాలని కేంద్రమంత్రిని రఘురామకృష్ణరాజు కోరారు. అంతేకాదు విపత్తు నిర్వహణ

నిధుల నుంచి కోతకు గురవుతున్న తీర ప్రాంతంలో రివిట్‌మెంట్‌ పనులకు రు. 200 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సమయంలో నర్సాపురం నియోజకవర్గంలోని మైనపువానిలంక గ్రామాన్ని నిర్మలా సీతారామన్‌ దత్తత తీసుకున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam