DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్తుల పాలిట ఆశాదీపం మానవతావాది ఈ సోనూ సూద్

*సోషల్ మీడియా లో పోస్ట్ కు ప్రత్యక్ష స్పందించే బంగారు గని*  

*అమ్మ పెట్టా. . పెట్టదు. . .పెట్టేవాడికి అడ్డంకులు కూడానూ . .*

*కరోనా ఈ దేశంలోని ఆర్తులకు అందించిన ఒక ఆశా దీపం*  

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 26, 2020 (డిఎన్ఎస్):*  కరోనా . . . ఈ దేశంలోని

ఆర్తులకు అందించిన ఒక ఆశాదీపం సోనూ సూద్. . ఎన్నో సమస్యలతో నిత్యం సతమతమవుతున్న ప్రజానీకం, తమ జీవన విధానం లో ఎదురయ్యే ఆర్ధిక సమస్యలకు ప్రభుత్వం నుంచి, మరే ఇతర రకంగానూ రాకపోవడంతో వారంతా సోషల్ మీడియా ద్వారా సహాయం కోసం అర్ధిస్తున్నారు. కరోనా సమయంలో జరిగిన లాక్ డౌన్ ప్రభావంతో వివిధ చోట్ల చిక్కుకు పోయిన వలస కార్మికులకు

నిత్యం ఆహారం అందించడం తో పాటు, వారిని స్వస్థలాలకు చేర్చడం కోసం ప్రత్యేకంగా రవాణా సదుపాయం అందించడం తో సినీ నటుడు, సోను సూద్ నడుంబిగించారు. వేలు, లక్షలాదిగా జనం సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి, మార్గం, రవాణా సుగమం చేసి, వారందరిని క్వారంటైన్ కి పంపేశారు. 

ఈ విధంగా ఈ

దేశం లోని ఆర్తులకు సోనూ సూద్ రూపంలో ఒక ఆపద్బాందువు దొరికినట్లయింది. దీంతో తమ కష్ఠాలను వీడియో ద్వారా సోషల్ మీడియా ద్వారా సోను సూద్ కు పంపడంతో, కేవలం 24 గంటల సమయంలోనే వారికీ తగిన పరిష్కారం చూపిస్తున్నారు సోనూ సూద్ బృందం. 

అదే విధంగా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సోనూ సూద్ పేరు మారుమ్రోగిపోయింది. టాటా సంస్థల

అధ్యక్షులు రతన్ టాటా సైతం, తానూ ప్రభుత్వానికి చేసిన కోట్లాది సాయం  సోనూ సూద్ కి ఇచ్చి ఉంటె సత్వరం ఆర్తులకు చేరి ఉండేది అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసారు. సాక్షాత్తు భారత్ ప్రధాని సైతం ఇతని సేవలకు ముగ్దులయ్యారు. మానవతా కల్గిన ప్రతి ఒక్కరూ సోనూ సూద్ కు అభినందనలు తెలియచేస్తుంటే. . అసూయ చెందిన వారూ

ఉన్నారు. 

వీళ్ళు సాయం చెయ్యడానికి ముందుకు రావడం లేదు సరికదా, సాయం చేసే సోనూ సూద్ బృందానికి నెగటివ్ ఫీడ్ కూడా ఇస్తున్నారు. మాహారాష్ట్ర కు చెందిన కొందరు ప్రజా ప్రతినిధులైతే ఏకంగా సోనూ సూద్ బీజేపీ ప్రతినిధి, రాజకీయాల్లోకి రావడం కోసం ఇదంతా చేస్తున్నట్టు నటిస్తున్నాడంటూ అవాకులు చెవాకులూ కూడా చెప్పిన

సందర్భాలు ఉన్నాయి. 

దీనిలో భాగంగానే ఆదివారం ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లి లోని ఒక పేద రైతు ఆర్థిక భారాన్ని తట్టుకోలేక, తన కుమార్తెలను ఎడ్లు స్థానం లో ఉంచి, తన పొలాన్ని దున్నడం ఒకరు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. దీనికి స్పందించిన సోనూ సూద్ ఒక్క రోజు సమయం ఇవ్వండి మీకు ఒక ట్రాక్టర్

పంపుతున్నాను, ఆడపిల్లలను చదువుకోమని చెప్పండి అంటూ రీ ట్వీట్ చేసారు. 
అంతే  వెంటనే సైన్ధ వులుగా మారి, అదే పోస్టు కి ప్రతి గా వీళ్ళు తప్పు వీడియో పెట్టు, మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు, ఇలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు, వీళ్ళకి సాయం చేసేముందు వందసార్లు ఆలోచించుకోండి అంటూ రీ ట్వీట్ లు చేశారు. 
ఇవేవీ

పట్టింపులేని సోనూ సూద్ ఆదివారం సాయంత్రాని కల్లా సరికొత్త ట్రాక్టర్ ఆ రైతు ఇంటికి పంపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam