DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా పోరాటయోధులకు బాధితులకు మద్దతు గా నిరాహారదీక్ష

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 26, 2020 (డిఎన్ఎస్):*  కరోనా కట్టడి లో వైసీపీ ప్రభుత్వం పూర్తి గా  చేతులేట్టేసిందని, ఫ్రంట్ లైన్ వారియర్ల త్యా గాలు, సేవలు వెలకట్టలేనివని, వారికి మద్దతుగా ఆదివారం నిరాహాదీక్ష చేపట్టామని పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు, మాజీ ఎంపీ తోట

సీతారామలక్ష్మి తెలిపారు.  కోవిడ్ వలన చనిపోయిన ఫ్రంట్ లైన్ పోరాట యోధులు, అలాగే కోవిడ్ బారిన పడి చనిపోయిన ప్రజలకు నివాళిగా దీక్ష సాగుతుందన్నారు.  అలాగే కరోనా భాదితులు పెరగడానికి అనేక మంది మృత్యువాత 
పడడానికి కేవలం ప్రభుత్వ వైరల్యమే కారణం అని విమర్శించారు. కరోనా మహమ్మా ర్తని అదుపు చేసేందుకు ప్రభుత్వం ఒక్క

ప్రయత్నం కూడా చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఏపిలో మార్చి  21 న 5 కేసులు ఉంటె జూలై 25 కి 90 వేలు కేసులకు చేరుకున్నాయన్నారు. 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వలన  కరోనా కేసుల్లో రోజువారీ పెరుగు దలలో దేశంలో రెండవ స్థానం లోకి, మరణాలలో నాలుగవ స్థానంలో ఏపీ చేరుకుందన్నారు. జగన్ బాధ్యతారాహిత్యం వలన ప్రజలు

కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. 
కరోనా విధులోల చనిపొయున ఫ్రంట్ లైన్ పోరాట యుధులు ( డాక్టర్లు , నర్సులు, పోలీస్, పారిశుధ్య సిబ్బంది, ప్రెస్ మీడియా, రెవెన్య & మునిసిపాల్ సిబ్బంది ) గా గుర్తించి వారు విధులలో ఉండగా మరణిస్తే రూ 50 లక్షలు పరిహారం వెంటనే చెల్లించాలన్నారు. జర్నలిస్టు లను పోరాట యోధుల జాబితాలో

చేర్చాలన్నారు. కరోనతో మృతి చెందిన ప్రజలకు వారి కుటుంబాలకి 10లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు. కోవిడ్ పేషంట్ కి పౌష్టకాహారం, డాక్టర్లు, నర్స లకు రక్షణకు మాస్కులు, ఇతరత్రా పరికరాలు అందించాల ని డిమాండ్ చేస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam