DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాపు ఉద్యమంలో తుని రూరల్ పీఎస్ లో నమోదైన 17 కేసుల తొలగింపు

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 27, 2020 (డిఎన్ఎస్):* కాపు రిజర్వేషన్ కోసం 2016 లో జరిగిన ఉద్యమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా తుని రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన 17 పోలీస్ కేసులను తొలగిస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు డిజిపి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ

అయ్యాయి. ఈ ఘటనలో తుని సమీపంలో రత్నాచల్ రైలు బోగీలు అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఈ ఘటనలోనే  సోమవారం విడుదలైన వివరాల్లో తుని రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులను వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పలుమార్లు క్షున్నంగా పరిశీలించి వీటిలో విచారణను తొలగించినట్టు తెలిపారు. ఈ కేసుల్లో పలువురు ప్రముఖులను సైతం

ముద్దాయిలుగా చేర్చి కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ ఉద్యమ నైపధ్యంలో మొత్తం 69 కేసులు నమోదు అయ్యాయి. వాటిలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండగా, మరి కొన్ని కేంద్ర పరిధిలో ఉన్నాయి.   

Cr.No.22/2016 u/s 143, 147, 148, 342, 384, 435, 307, 353, 120-B r/w 149 IPC, 3
& 4 of the Prevention of Damage to Public Property Act, 1984 

Cr.No.23/2016 u/s 143, 147, 148, 342, 384, 435, 307, 353, 120-B r/w 149 IPC, 3 & 4 of the Prevention of Damage to Public Property Act,

1984.

నుంచి  
Cr.No.69/2016 u/s 147, 148, 143, 435,  307, 332, 109 R/w 149 IPC 3 & 4 of the
Prevention of Damage to Public Property Act 1984 and 7(1) of the Criminal law amendment Act,1932   
సహా అన్ని కేసుల్లోనూ విచారణను తొలగించారు.  

 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam