DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గో రక్షకుల కే ఘోరమైన శిక్షలా ? : స్వామి శివానందలహరి

గో రక్షకుల కే ఘోరమైన శిక్షలా ? : స్వామి శివానందలహరి 

విశాఖపట్నం, జులై 12 , 2018 (DNS Online ) : ఊరూరా గోశాలలను నిర్మించి, వేలాదిగా గోవులను రక్షిస్తున్న శ్రీపీఠాధిపతి

స్వామి పరిపూర్ణానంద పై హైదరాబాద్ నగర బహిష్కరణ వేటు వేసి తెలంగాణ ప్రభుత్వం దిద్దుకోలేని తప్పు చేసిందని, స్వామి శివానందలహరి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం

నగరానికి వచ్చిన అయన DNS కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో చాలా అంశాలు వివరించారు. తిరువన్నామలై లోని అన్నపూర్ణ ఆశ్రమ నిర్వాహకులుగా ఉన్న శివానందలహరి ఊరూరా

తిరుగుతూ గోమాతలను రక్షించమని ప్రజలను కోరుతున్నారు. గోవు వాళ్ళ కలిగే ఎన్నో ఉపయోగాలను ప్రతి గ్రామం లోనూ తెలియచేస్తూ ప్రజలకు అవగాహనా కల్పిస్తున్నారు.

గోశాలలను నిర్మించి, ప్రతి హిందువు ఒక గోవును పెంచుకుని, దాని ఆలనా పాలన చూడాలి అని పరిపూర్ణానంద ప్రచారం చేస్తున్నారని, సమాజానికి హితవు కోరుతూ భగవద్గీత

ప్రచారాన్ని సుమారు 44 సార్లు సంపూర్ణం గా ప్రచారం చేశారని, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం వెలివేసినట్టు గా సమాజానికి దూరం పెట్టిన ఎన్నో గిరిజన గ్రామాలను

దత్తత తీసుకుని, అక్కడ ఆలయాలు, పాఠశాలలు నిర్మించి, ఉచిత విద్య అందిస్తున్న స్వామి పరిపూర్ణానంద ను ఒక ఉగ్రవాదిగా, తీవ్రవాదిగా, సంఘ విద్రోహ శక్తిగా ప్రచారం చేసి,

తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కరణ చెయ్యడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. అదే ఊళ్లు ఉన్న ఒవైసీ సోదరులు ఒక ఇరవై నిమిషాల సమయం ఇస్తే మొత్తం ఈ దేశం లో హిందువు

అనేవాడు లేకుండా చేస్తాను అని అంటే ఈ కేసీఆర్ కి కనపడలేదా అని ప్రశ్నించారు. ఈ దేశం లో హిందువులకు స్థానం లేకుండా చేసేందుకు విదేశీ శక్తులతో కలిసి

కుట్రచేస్తున్నదన్నారు. సాధు సమ్మేళనం, హిందూ ధార్మిక సంఘాలు, హైందవ సమాజం వీళ్ళ ఆగడాలను, దుశ్చర్యలను చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam