DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అదనపు సిబ్బంది, వనరులను పెంచుకోండి: వైద్య శాఖామంత్రి ఆళ్ల

*కోవిద్ పేషెంట్లకు అదనపు సదుపాయాలు కల్పించాలి*  

*తూగో జిల్లా లో పెరుగుతున్న కరోనా కేసులపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 29, 2020 (డిఎన్ఎస్):* కరోనాసురుడి విజృంభణ ను ధీటుగా ఎదుర్కొనేందుకు జిల్లాలోని ఆసుపత్రులు, కోవిద్ 19 కేర్ సెంటర్ లో వైద్య

ఆరోగ్య పారిశుద్ధ్య సదుపాయాలను అదనంగా పెంచుకోవాలని డాక్టర్లు సిబ్బందిని కూడా కొత్తగా నియామకం చేసుకోవాలని  రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ తూర్పు గోదావరి  వైద్యాధికారులను సూచించారు. 

కోవిద్ పాజిటివ్ వచ్చిన  పేషెంట్లకు అదనపు సదుపాయాలు కల్పించాలని,

 ఆహార సరఫరాలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఆస్పత్రిలో పేషెంట్లను జాయిన్ చేసుకోకపోతే చర్యలు తీసుకుంటామన్నారు.  రాష్ట్రంలో 17 వేల మంది వైద్యులు,  సిబ్బందిని నియమించడం జరుగుతుంది/ కేసులు పెరిగితే దానికి అనుగుణంగా వైద్యసేవలు

పెంచుతాం/

కోవిద్ 19 సర్వీసులకు మరో ఐఏఎస్ అధికారి నియామకం చేస్తున్నట్టు తెలిపారు. 

తూర్పు గోదావరి జిల్లాలో పెరుగుతున్న కోవిద్ 19 పాజిటివ్ కేసులు దృష్ట్యా రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని బుధవారం నాడు రాజమహేంద్రవరం ఇచ్చేసి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ లో

రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, జిల్లా కలెక్టరు డి మురళీధర్ రెడ్డి, ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ తో కలిసి జిల్లా  అధికారులతో సమీక్షించారు. 
 ఈ సమీక్షా సమావేశంలో మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ కోవిద్ 19 పేషెంట్లకు క్వాలిటీ ఆహారం అందించాలని అది

కూడా సమయానికి అందించాలని పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన చోట పడకలు పెంచాలని, కాల్ సెంటర్ల పనితీరు చురుగ్గా ఉండాలని కాల్  వచ్చిన అనంతరం స్పందన వేగంగా ఉండాలన్నారు. కాల్ సెంటర్లో రిజిస్టరు నిర్వహించాలన్నారు. కోవిద్ 19 పేషెంట్లకు తక్షణ వైద్య సదుపాయం ఆహారం అందించటంలో రాష్ట్ర

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో పదివేల పడకల ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గర్భిణీ స్త్రీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవసరమైన డాక్టర్లు, గైనకాలజిస్ట్ నియమించుకోవాలి అన్నారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ పరీక్షలు నిర్వహించడంలో రిపోర్టులు

త్వరగా వచ్చే విధంగా పనిచేయాలని సూచించారు. మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ కోవిద్ పేషెంట్లకు తగిన మందులు కిట్లను సకాలంలో అందే విధంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా మాట్లాడుతూ మార్కెట్లో షాపుల నిర్వహణ తక్కువ సమయం ఉండడం వల్ల మరింత రద్దీ

పెరుగుతుందని దీనిపై మార్పులు చేయవలసిన అవసరం ఉందన్నారు. ఎంపీ భరత్ రామ్ మాట్లాడుతూ కోవిద్ కేర్ సెంటర్లు, కోవిద్ ఆసుపత్రిలో పేషెంట్లు సౌకర్యార్థం ఎక్కడ ఎటువంటి వేకెన్సీ ఉన్నది అనే విషయంపై సమాచారాన్ని ఆయా సెంటర్లలో ప్రదర్శన చేసే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి కి సూచించారు. జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి,

జిల్లాలో చేపట్టిన కోవిద్ 19 నివారణ కార్యక్రమాలను  మంత్రికి వివరించారు. జిల్లాలో వైద్యం చేయబడి డిస్చార్జిలు సంఖ్య పెరుగుతోందన్నారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ అభిషి క్త్  కిషోర్ మాట్లాడుతూ నగరంలో అర్బన్ హెల్త్ సెంటర్ ల ద్వారా  పరీక్షలు నిర్వహించడం వలన జిల్లా ఇతర ఆసుపత్రులు కోవింద్

సెంటర్లఫై భారం తగ్గుతుంది అన్నారు. స్థానిక నాయకులు  శివ రామ సుబ్రహ్మణ్యం తగు సూచనలు ఇచ్చ్చారు. సమావేశంలో జిల్లా అర్బన్ ఎస్పీ షి మోషీ వాజ్ పేయి,   జాయింట్ కలెక్టర్ లు రాజకుమారి, కీర్తి చేకూరి, కోవిద్ నోడల్ ఆఫీసర్ లు  మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam