DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి జర్నలిస్ట్ రాము మృతిపై విచారణకు ఆదేశం

*బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: వైద్యశాఖామంత్రి ఆళ్ళ నాని*  

*ఆక్సిజన్ నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేసిన రాజమండ్రి ప్రెస్ క్లబ్*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 29, 2020 (డిఎన్ఎస్):* రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  ఆక్సిజన్ అందక  జర్నలిస్ట్   సుంకర

రామారావు(రాము) మృతి చెందిన ఘటనపై జిల్లా అధికారులు విచారణ చేస్తున్నారని  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , వైద్య ఆరోగ్య శాఖా మంత్రి  ఆళ్ళ నాని తెలిపారు.ఈ విషయంలో ప్రభుత్వాసుపత్రిలో ఎవరినిర్లక్ష్యం ఉన్నా వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేసారు.రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం జరిగిన  మీడియా

సమావేశంలో  ఈ ఘటనపై  రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్ధసారధి మంత్రి నాని కి  ఫిర్యాదు చేసారు. దీనిపై స్పందించిన మంత్రి ప్రక్కనే ఉన్న జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు.దీనిపై ఇప్పటికే విచారణ చేపట్టామని కలెక్టర్ మంత్రికి వివరించారు.రాజమండ్రి ప్రభుత్వ

ఆసుపత్రిలో పలువురు కోవిడ్ రోగులు ఆక్సిజన్ అందక చనిపోతున్నారని విలేఖరులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.విలేఖరి రాము మృతిపై విచారం వ్యక్తం చేసిన నాని ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టామని,రోగులకు తగినంత పడకలు, ఆక్సిజన్ సరఫరా తదితర సమస్యలను పర్యవేక్షించేందుకు ఆనంద్ అనే ఐ ఏ ఎస్ అధికారిని

నియమించినట్లు చెప్పారు.
జర్నలిస్ట్ లను కరోనా వారియర్స్ గా గుర్తించాలి : మంత్రికి వినతి 
అనునిత్యం అనేక సవాళ్లతో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా గుర్తించి కరోనా బీమా వర్తింపచేయాలని ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ద్వారా మంత్రి ఆళ్ళ నాని కి పాత్రికేయులు వినతిపత్రం అందజేశారు.రాజమండ్రి

నగరంలో విధినిర్వహణలో పలువురు పాత్రికేయులు కోవిడ్ బారిన పడి హొమ్ క్వారంటేయిన్ లో ఉన్నారని ,కరోనా తో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్ట్ లకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్ధసారధి మంత్రికి అందజేసిన వినతి పత్రంలో డిమాండ్ చేసారు.రాజమండ్రి లో కోవిడ్ తీవ్రత దృష్ట్యా విలేఖరులు వైరస్

బారినపడితే వారికి ప్రత్యేక క్వరెంటైన్ సెంటర్ ఏర్పాటుచేసి అత్యవసర వైద్యం అందించాలని కోరారు.కోవిడ్ తో మృతిచెందిన పాత్రికేయ కుటుంబాలకు 50  లక్షల రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేసారు.రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు  కొత్తపల్లి దుర్గ ప్రసాద్ జాయింట్ సెక్రటరీ పాలపర్తి శ్రీనివాసు,కార్యవర్గ సభ్యులు

ఖండవిల్లి శ్రీనివాస్,వేగి గణేష్,దివాకర్ల ఆనంద్ ,సంగిరెడ్డి తిరుమల ,ప్రెస్ క్లబ్ సభ్యులు సత్య, వరప్రసాద్, హరీష్, కృష్ణ, సతీష్, గోపి, గంగాధర్, గరగ ప్రసాద్, శ్రీకాంత్ , ఓలేటి దివాకర్, రవి తదితరులు మంత్రికి వినతిపత్రం అందించినవారిలో ఉన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam