DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇంతకీ ఈ అప్పన్న ప్రసాదం ఎవరి ఖాతాలోకి వెళ్తుంది. అవంతా? సంచాయితా?

*సింహగిరి అభివృద్ధి కి కేంద్రం నుంచి రూ. 53 కోట్లు. . .* 

*నేను లేక వ్రాస్తే ఇచ్చేసింది: మంత్రి అవంతి ప్రకటన,    

*కేంద్రమంత్రి శుభాకాంక్షలు చెప్పింది చైర్ పర్సన్ సంచయితకే. . .*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 29, 2020 (డిఎన్ఎస్):* కేంద్ర ప్రభుత్వం

ఆలయాలు, పర్యాటక కేంద్రాల అభివృద్ధికై ఎంపిక చేసిన ప్రాంతాలకు భారీ మొత్తం లో నిధులు ఇస్తుంది. దీన్ని ప్రసాద్‌ (నేష‌న‌ల్ మిష‌న్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేష‌న్ అండ్ స్పిర్చువ‌ల్ అజ్‌మెంటేష‌న్ డ్రైవ్‌) పథకంలో భాగంగా ఇస్తుంది. 
ఈ పధకం ద్వారా విశాఖ నగర సమీపంలోని శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రం

సింహాచలం ఎంపిక అయ్యింది. దీనికి గాను రూ. 53 కోట్లు నిధులను కేంద్రం కేటాయించింది. 

అయితే కేంద్రం నుంచి ఈ ప్రకటన విడుదల కాగానే స్థానిక రాష్ట్ర మంత్రి (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ )  ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసేసారు. తానూ కేంద్రానికి లేఖ రాయడం వల్లనే ఈ నిధులు

వచ్చాయంటూ. దీనిలో దేనికి ఎంత ఖర్చు పెట్టాలో కూడా వివరాలు ఇచ్చేసారు. అయితే ఈ లెక్కల్లో చూపినవి గతంలో వివాదాల్లో చిక్కుకున్న అంశాలు కావడం గమనార్హం. 

అదే సమయంలో సింహాచల దేవస్థానం చైర్ పర్సన్ ( భారతీయ జనతా పార్టీ నేత) సంచాయితా గజపతి ట్విట్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ ఎస్ పటేల్ కు

ధన్యవాదాలు తెలిపారు. 

ప్రసాద్ పథకం కింద సింహాచలం దేవస్థానాన్ని ఎంపిక చేసినందుకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌కూ సింహాద్రి అప్పన్న భక్తుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ప్రకటించారు. 

దీంతో దేవస్థానానికి నిధులు మా వల్లే వచ్చాయి అని ఒకరు, మా పార్టీ

నేతల సహకారంతో కేంద్రమంత్రి ప్రోత్సాహం వాళ్ళ వచ్చాయంటూ చైర్మన్ ప్రకటనలు చెయ్యడంతో మీడియా వర్గాల్లో సందిగ్ధం నెలకొంది. 

కేంద్రమంత్రి ప్రహ్లాద్ ఎస్ పటేల్ మాత్రం తన ప్రకటనలో ఆలయ చైర్ పర్సన్ సంచయితకు శుభాకాంక్షలు తెలియచేయడం గమనార్హం. 

ప్రసాద్ పథకం కింద సింహాచలం దేవస్థానాన్ని ఎంపిక

చేసినందుకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌కూ సింహాద్రి అప్పన్న భక్తుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా పలు యత్రాస్థలాలను ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అభివృద్ధిచేస్తోంది

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam