DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ గోషా ఆసుపత్రిలో 20 మంది కి కరోనా పాజిటివ్

*బెంబేలెత్తుతున్న ఆసుపత్రి సిబ్బంది, పేషంట్లు. ..* 

*మొన్నే 5 గురికి వచ్చిన వారి కాంటాక్టులు గా అనుమానం.* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 30, 2020 (డిఎన్ఎస్):* విశాఖపట్నం విక్టోరియా ప్రసూతి ప్రభుత్వ ( గోషా) ఆసుపత్రిలో 20 మంది సిబ్బంది కి కరోనా పాజిటివ్ రావడంతో

ఇటు  ఆసుపత్రి సిబ్బంది, అటు పేషంట్లు బెంబేలెత్తుతున్నారు. గురువారం ఈ వార్త తెలియడం తో ఒక్కసారిగా ఆసుపత్రిలో కలకలం రేగింది. గురువారం పాజిటివ్ గా గుర్తించబడినవారిలో  అసోసియేట్ ప్రొఫెసర్ 1 , నర్సులు 2 , ఆయాలు 4 గురు , సెక్యూరిటీ  5, ఉన్నారు. దీంతో మొత్తం ఆసుపత్రి సిబ్బందిలో కలవరం పెరిగిపోయింది. ఏంటో జాగ్రత్తలు

తీసుకుంటున్నప్పటికీ తమ సిబ్బందికి కరోనా సోకడం బాధాకరం గా ఆసుపత్రి వర్గాలు తెలియచేస్తున్నాయి. ఇదే ఆసుపత్రిలో గత వారం 5 గురు సిబ్బంది పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. వారితో కాంటాక్ట్ ఉండడంతో వీరికి కూడా సోకింగా అనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. 

అయితే పేదప్రజలకు అండగా ఉన్న ఈ ప్రసూతి ఆసుపత్రిలో నిత్యం

జనం సంచారం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఎక్కడా పేషంట్లకు సోకకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam