DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సిరిసిల్ల నర్సింగ్‌ కాలేజీ ఉద్యోగి ఆత్మహత్య

*మోసపోయానన్న అవమానంతో .. పురుగుల మందు తాగి*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 30, 2020 (డిఎన్ఎస్):* తెలంగాణ లోని సిరిసిల్లలోని నర్సింగ్‌ కళాశాలలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కుంభం రవీందర్‌(43) బుధవారం కరీంనగర్‌ విద్యానగర్‌ లోని తన ఇంటిలో పురుగుల మందుతాగి ఆత్మహత్య

చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన రవీందర్‌ పడకగదిలోకి వెళ్లి బాత్‌రూంలో పురుగుల మందుతాగి బయటకు వచ్చాడు. ఆయన నోటి వెంట నురుగులు రావటంతో వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పడికే మరణించాడని వైద్యులు తెలిపారు. రవీందర్‌కు రెండేళ్ల కిందట

హైదరాబాద్‌కు చెందిన కళ్యాణ్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు హైదరాబాద్‌లో ఫోర్‌స్క్వేర్‌ కంపెనీ ఉందని, దాని ద్వారా అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎవరైనా ఉంటే పంపించాలని చెప్పాడు. 
దీనితో కొత్తపల్లికి చెందిన దేవదాసుతోకలిసి కరీంనగర్‌, వరంగల్‌, కోరుట్ల, హైదరాబాద్‌ ప్రాంతాలకు చెందిన తనకు

పరిచయం ఉన్న ఎనిమిది మంది వద్ద 40 లక్షల రూపాయలు తీసుకుని కళ్యాణ్‌కు ఇచ్చాడు. ఆ తరువాత వారికి కళ్యాణ్‌ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చి శిక్షణ ఇచ్చాడు. నెలరోజుల తరువాత కార్యాలయం మూసివేశాడు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు రవీందర్‌ వద్దకు వచ్చి డబ్బులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీనితో రవీందర్‌ సగం

వరకు డబ్బులు చెల్లించాడు. మిగతా సగం డబ్బులు చెల్లించలేక..మోసపోయాననే అవమానం భరించలేక తీవ్ర ఒత్తిడితో మనస్థాపం చెందిన రవీందర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు మృతుడి భార్య కుంభం భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రెండోఠాణా పోలీసులు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam