DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫంక్షన్ హాళ్లను కోవిడ్ కేంద్రాలుగా మార్చాలి: ఉండవల్లి

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 30, 2020 (డిఎన్ఎస్):* కోవిడ్ రోగులకు తాత్కాలిక సహాయ కేంద్రాలు నడిపేందుకు ఫంక్షన్ హాళ్లను స్వాధీనం చేసుకుని ఎన్జీవోలు, ట్రస్టులకు అప్పగించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్  కోరారు. ఈమేరకు గురువారం సీఎం జగన్‌కు ఆయన ఓ  లేఖ రాశారు.  కోవిడ్ సహాయ

కేంద్రాల నిర్వహణ ఖర్చును ఎన్జీవోలు, ట్రస్టులు భరిస్తాయని, అయితే  ప్రభుత్వం నుంచి డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని అందించాలని ఆయన సూచించారు.  రాజమండ్రిలో జైన్ సంఘం ఇప్పటికే అద్దెకు కళ్యాణ మండపం తీసుకొని 60 పడకలతో కరోనా సెంటర్‌  నడుపుతోందని లేఖలో ఉండవల్లి ప్రస్తావించారు. ప్రైవేట్ ఆస్పత్రులను కూడా కొవిడ్

పరీక్షలకు అనుమతించి  ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించాలన్నారు. ప్రస్తుతం పేద, దిగువ మధ్య తరగతి ప్రజలు డబ్బు లేదా పలుకుబడి ఉంటే తప్ప కరోనా బారినపడి జీవించలేమని ఆవేదన చెందుతున్నారని అయన పేర్కొంటూ అందుకే తన సూచన పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కాగా  కొవిడ్‌కు వ్యతిరేకంగా యుద్ధాన్ని గెలవడానికి సీఎం

జగన్‌కు  బలాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నానని అరుణ్‌కుమార్ పేర్కొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam