DNS Media | Latest News, Breaking News And Update In Telugu

8 వేల మంది కి తగ్గ సౌకర్యాలకు చర్యలు :కలెక్టర్ నివాస్  

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 30, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లా లో కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనుటకు జిల్లాలో 8 వేల మందికి సరిపడా సౌకర్యాలు ఉండాలని యోచిస్తున్నామని జిల్లా కలెక్టర్ జె నివాస్ చెప్పారు. వైష్ణవి ఇంజనీరింగు కళాశాల, నూతనంగా నిర్మిస్తున్న నర్సింగు

కళాశాలల్లో కోవిడ్ కేర్ కేంద్రాల ఏర్పాటును గురువారం పరిశీలించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ కేంద్రాల్లో 3 వేల పడకలను ఏర్పాటు చేసామని ఇందులో పాత్రునివలసలో 2 వేలు, సంతబొమ్మాళిలో వెయ్యి పడకలు ఉన్నాయని చెప్పారు. అదనంగా 2 వేల పడకలను కోవిడ్ కేర్ కేంద్రాల్లో ఏర్పాటుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

కనీసం 3 వేల మందిని హోమ ఐసోలేషన్ లో పెట్టి చికిత్సను అందించుటకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో 1389 మంది, కోవిడ్ కేర్ కేంద్రాల్లో 757 మంది, కోవిడ్ ఆసుపత్రుల్లో 641 మంది మాత్రమే ఉన్నారని వివరించారు. కోవిడ్ ఆసుపత్రుల్లో 18 వందల పడకలు ఉన్నాయని వాటిలో కేవలం 30 శాతం పడకలు మాత్రమే నిండాయని చెప్పారు.

రాజాం, పాలకొండ ఏరియా ఆసుపత్రుల్లో వంద పడకలను ఏర్పాటు చేసామని, టెక్కలి జిల్లా ఆసుపత్రిలో 105 పడకలు ఏర్పాటు చేసామని వీటితోపాటు ప్రైవేటు ఆసుపత్రులైన గొలివి ఆసుపత్రి, పి.వి.ఎస్ రామ్మోహన ఆసుపత్రి, అమృత ఆసుపత్రులను కూడా కోవిడ్ కేసులు చేర్చుకొనుటకు నిర్ణయించామని పేర్కొన్నారు. జెమ్స్ ఆసుపత్రిలోని ప్రస్తుతం ఉన్న 50ఐసియు

బెడ్లను 80 కు పెంచుతున్నామని చెప్పారు. తద్వారా 150 ఐసియు బెడ్లు, 1324 ఆక్సిజన్ అందుబాటులో ఉన్న ఐసియు కాని బెడ్లు లభ్యంగా ఉంటాయని చెప్పారు. 
24 గంటల్లో నమూనా ఫలితాలు :  కోవిడ్ నమూనాలు సేకరించి 24 గంటల్లో ఫలితాలు అందించే ఏర్పాట్లు చేసామని కలెక్టర్ నివాస్ చెప్పారు. ఈ నెల 28వ తేదీన తీసిన నమూనాల ఫలితాలు వెల్లడించామని, కొద్ది

రోజుల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించే దిశగా సామర్ధ్యాన్ని పెంపొందించామని ఆయన అన్నారు. 
ఆర్ట్సు కళాశాలలో స్వచ్చందంగా పరీక్షలు :  స్వచ్చందంగా కరోనా పరీక్షలు నిర్వహించుకొనుటకు ముందుకు వచ్చే వారి కోసం ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల) లో కేంద్రాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజుకు 150 వరకు

నమూనాలు తీసే సౌకర్యం పెట్టామని అన్నారు. వృద్ధులు, మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసామని ఆయన చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పి.హెచ్.సి), సామాజిక ఆరోగ్య కేంద్రం (సి.హెచ్.సి) పరిధిలో పరీక్షలు నిర్వహించుటకు చర్యలు చేపట్టామని అన్నారు. కరోనా లక్షణాలు కలిగిన వారు తక్షణం పరీక్షలు చేయించుకోవాలని, ఆలస్యం చేసి ప్రాణాల

మీదకు తెచ్చుకోరాదని కలెక్టర్ కోరారు. 
    ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, తహశీల్దారు దిలీప్ చక్రవర్తి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రకాష్, సమగ్ర శిక్షా అభియాన్ కార్యనిర్వాహక ఇంజనీరు వి.వెంకట కృష్ణయ్య, ఏపిఎంఐడిసి డిఇ ప్రసాద్, జెఇ అరుణ్ కుమార్

తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam