DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గో శాలల రక్షణకు సహకరించండి : బీజేపీ ని కోరిన శివానందలహరి

గో శాలల రక్షణకు సహకరించండి : శివానందలహరి 

విశాఖపట్నం, జులై 12 , 2018 (DNS Online ) : సర్వ ప్రాణి కోటికి శుభం కల్గించే గోమాత ను రక్షించాలని, తద్వారా గోశాలలను

పరిరక్షించాలని తిరువన్నామలై అన్నపూర్ణ ఆశ్రమం నిర్వాహకులు స్వామి శివానందలహరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ను కోరారు. గురువారం నగరానికి

వచ్చిన స్వామి, నగర పర్యటనలో ఉన్న కన్నా ను కలిసి, తమ సంస్థ చేస్తున్న గోమాత ప్రచారాన్ని వివరించారు. గత దశాబ్దాల కాలం లో ప్రతీ గ్రామం సంచరిస్తూ గోమాతను కాపాడాలని

కోరుతున్నట్టు తెలిపారు. గోమాత ఇచ్చే క్షీరం, పంచకం తదితర అన్ని పదార్ధాలు మానవ జీవితానికి ఔషధం లా పనిచేస్తుందని తెలిపారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనాలు ఎన్నో

ఉన్నాయన్నారు. ప్రతి కుటుంబం ఒక గోవును దత్తత తీసుకుని సాకడం ద్వారా కుటుంబాన్ని, గ్రామాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడవచ్చన్నారు. ప్రతీ గ్రామం లోనూ ఒక

గోశాల ఉండడం ద్వారా స్థానికంగా ఉండే విద్యాలయాలు, ఆశ్రమాలకు పాలు, పెరుగు లాంటివి సరఫరా చేయవచ్చన్నారు. ఈ బ్రహత్తర కార్యక్రమాన్ని బీజేపీ ఆధ్వర్యవం లో ముందుకు

తీసుకువెళ్ళాలి అని కోరారు. ఈ సమావేశం లో బీజేపీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, విశాఖ నగర బీజేపీ అధ్యక్షులు ఎం. నాగేంద్ర, సీనియర్ నాయకులూ పృద్విరాజ్ తదితరులు

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam