DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజధానులపై బీజేపీ లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి

*రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజు అలా. . నగరాద్యక్షులు రవీంద్ర ఇలా. .* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 23, 2020 (డిఎన్ఎస్):*  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానులుగా  మూడు ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేయడం ద్వారా

అధికారికంగా ప్రకటన విడుదలైంది. దీనిపై రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు భిన్న వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు అభ్యంతరం తెలియచేయగా, నగర అధ్యక్షుడు ఎం. రవీంద్ర రెడ్డి దీనికి భిన్నమైన వ్యాఖ్య చేయడం గమనార్హం. దీనికి అదనంగా మాజీ ఎమ్మెల్యే సైతం భిన్న వ్యాఖ్యలు చేయడం వారి

వ్యక్తిగతం గా పార్టీ నేతలు భావిస్తున్నారు. 

నూతన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇలా :. . 
 
నూతనంగా రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన ఎమ్మెల్సీ సోము వీర్రాజు తాము రాజధానిగా అమరావతికి కట్టుబడి ఉన్నాం అంటూ శుక్రవారం రాత్రి  అధికారికంగా ప్రకటన విడుదల చేయడం జరిగింది. రాజధానుల విషయంలో కేంద్రం గానీ,

బీజేపీ గానీ ఎటువంటి సంబంధం లేదు అని విషయాన్నీ కూడా అయన తెలియచేయడం జరిగింది. 

విశాఖ నగర అధ్యక్షుడు ఎం. రవీంద్ర అలా :. . .

అయితే దీనికి భిన్నంగా విశాఖ నగర అధ్యక్షుడు ఎం. రవీంద్ర రెడ్డి, ఆర్ధిక రాజధానిగా విశాఖ పేరును తామే శాసన సభలో మొదట ప్రస్తావించామన్నారు. 

అమరావతి రాజధానిగా ఆనాడు

అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అందులో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకోవడం జరిగింది, విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలన్నది మా ఆకాంక్ష, అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైసిపి పార్టీ కానీ కేవలం రాజధాని పేరుతో వ్యాపారం చేస్తున్నట్టుగా నేను

భావిస్తున్నాను, విశాఖ తనకు తానుగా అభివృద్ధి చెందుతున్న మహానగరం, అయితే రాజధానిగా మారడం వల్ల అనేకమైన క్లిష్టమైన సమస్యలు ముందు ముందు వచ్చే అవకాశం ఉందని నా భావన, ఏదేమైనా విశాఖ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది అని మీడియా కు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.  

వీరిద్దరి విరుద్ధ వ్యాఖ్యల

నైపధ్యంలో సీనియర్ నేతలు ఏమి మాట్లాడాలో తెలియక సతమతమవుతుంటే. . . క్రింది స్థాయి మాత్రం మండిపడుతున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam