DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం జిల్లాలో ముమ్మరంగా సప్తవార కార్యక్రమం

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  ఆగస్టు 01, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లాలో సప్త వార కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి సర్వే నిర్వహిస్తూ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.

అందులో భాగంగా కంటైన్మెంటు జోన్ లు, పాజిటివ్ కేసుల ఇళ్ళ వద్దకు కూడా వెళ్ళి ఆరోగ్య పరిస్ధితిని గమనిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి కరోనా లక్షణాలతో ఉన్న వారిని గుర్తించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ శుక్ర వారం కూడా  ఆదేశాలు జారీచేసిన విషయం విదితమే. జ్వరం, ఆయాసం, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారిని గుర్తించాలని –

ఆయాసం ఉంటే తక్షణం ఆసుపత్రికి తరలించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు. పాజిటివ్ కేసులను, అనారోగ్యంతో ఉన్న వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళుటకు తహశీల్దారుల వద్ద అంబులెన్సులను కూడా ఏర్పాటు చేసారు. దీంతో ఆసుపత్రికి తరలింపు మరింత సులభంగా వేగంగా జరుగుతోంది. గార మండలం ప్రత్యేక అధికారి జి.రాజారావు ఆది వారం

శ్రీకూర్మం పంచాయతీలోని కంటైన్మెంటు జోన్లలో పర్యటించగా, భామిని ప్రత్యేక అధికారి రామారావు బత్తిలి కంటైన్మెంటు జోన్ లో పర్యటించారు. శ్రీకాకుళం మండల పరిషత్ అధికారి ప్రకాష్ శ్రీకాకుళం మండలంలో పలు కంటైన్మెంటు జోన్లలో పర్యటించడమే కాకుండా ఇంటింటి సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఇతర మండలాల అధికారులు సైతం మండలాల్లో

పర్యటిస్తూ పాజిటివ్ కేసుల ఇళ్ళ వద్దకు వెళ్లి పాటించాల్సిన నియమాలను గూర్చి తెలియజేసారు. కంటైన్మెంటు జోన్లలో ఎవరూ రాకపోకలు సాగించరాదని ఆదేశించారు. నమూనాల సేకరణ పెద్ద ఎత్తున చేపట్టారు. ముఖ్యంగా కంటైన్మెంటు జోన్ లలో అన్ని కుటుంబాల నుండి నమూనాలు సేకరించడంలో ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు

రావాలని ప్రత్యేక అధికారులు సూచించారు. బయటకు వచ్చినపుడు విధిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను తరచూ సబ్బుతో గాని, శానిటైజర్ తోగాని శుభ్ర పరచుకోవాలని కోరారు. పాజిటివ్ వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు విధిగా హోమ్ ఐసోలేషన్ పాటించాలని ఆదేశించారు. కుటుంబ సభ్యులకు నెగిటివ్ వచ్చినప్పటికి బయటకు తిరగరాదని

పేర్కొన్నారు. కంటైన్మెంటు జోన్లలో వ్యక్తుల సైతం రాకపోకలు ఉండరాదని సూచించారు. రాకపోకలు సాగించడం వలన కరోనా వైరస్ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుందని అవగాహన కలిగించారు. ఇంటింటికి సర్వేకు వస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు విధిగా వాస్తవ సమాచారం అందించాలని వారు సూచించారు. 60 సంవత్సరాలు పైబడిన వారు, చిన్నారుల పట్ల

జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా లక్షణాలు కనిపించగానే తక్షణం అప్రమత్తమై పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam