DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాకు కరోనా వస్తే రిమ్ స్  లోనే చేరుతా: మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు

*ప్రభుత్వ వైద్య కళాశాలలో మత్స్య శాఖ మంత్రి సమీక్ష*

*జిజిహెచ్ లో చికిత్స ప్రతిష్టాత్మకంగా భావించాలి*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  ఆగస్టు 03, 2020 (డిఎన్ఎస్):* తనకు కరోనా వైరస్ వచ్చినా  శ్రీకాకుళం జిల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ వైద్య కళాశాల

(రిమ్ స్ ) లోనే చేరుతానని, మత్స్య శాఖ మంత్రి  మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సంచలన ప్రకటన చేసారు. సోమవారం కాశాలలో నిర్వహించిన సమీక్షలో అయన ఈ ప్రకటన చేసారు. శ్రీకాకుళం జిల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్ స్ ) లో స్పెషాలిటీ సేవలు అందించాలని, ప్రతిష్టాత్మకంగా నిలవాలని, సిటిడి విధానం

ఉపయోగించాలని, రిమ్స్ సాధారణ చికిత్స లకు మాత్రమే పరిమితం చేయరాదన్నారు. బెడ్లకు ఆక్సిజన్ సరఫరా ఉండాలని తెలిపారు. 

చికిత్స పొందుతున్న వ్యక్తిని సొంత వాళ్ళు చూడాలని అనుకుంటే, సొంత పిపిఇ కిట్ తో వస్తే అనుమతించుటకు పరిశీలించాలని తెలిపారు. ప్లాస్మా థెరఫీ పరిశీలించాలన్నారు. ఇందుకు రికవరీ జరిగిన పేషేంట్లను

రక్త దానం చేయుటకు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. ప్లాస్మా థెరఫీ తక్కువ ఖరీదుతో చేయవచ్చని, అవసరమైన పరికరాలు అందించేందుకు సియం జగన్ మోహన్ రెడ్డి సిద్దంగా ఉన్నారన్నారు. చికిత్స పొందుతున్న వారిలో విశ్వాసం, నమ్మకం కలిగించాలన్నారు. గతంలో వైద్య సేవలకు ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లేవారని, కరోనా నేపథ్యంలో

ప్రభుత్వ వైద్య సేవలపై భారం పడిందన్నారు. సేవలు విస్తృత పరచాల్సిన అవసరం ఉందని వైద్యులకు తెలిపారు. ప్రతి వార్డుకు ఒక పి.ఆర్.ఓ ను నియమించడం ద్వారా పేషేంట్లకు అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. ఐఎంఏ సభ్యులతో డిఎంహెచ్ఓ చర్చించాలన్నారు. ప్రభుత్వం ఉత్తమ ప్యాకేజి ఇస్తుందని, సిబ్బందిని కేటాయింపుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ప్రైవేటు ఆసుపత్రులు కరోనా చికిత్సకు ముందుకు రావాలి. భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తద్వారా వైద్య సేవల భారం తగ్గుతుందని తెలిపారు. 
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జె నివాస్, ప్రిన్సిపాల్ మరియు జిజిహెచ్ ఇన్ ఛార్జ్ పర్యవేక్షకులు డా.ఏ.కృష్ణవేణి, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్,  డి.ఎం.హెచ్. ఓ డా.ఎం.చెంచయ్య,

డా.ఏ.కృష్ణ మూర్తి, డా.ప్రభాకర రావు, డా.సనపల నరసింహ మూర్తి, డా.నరేశ్, డా.చలమయ్య, ఎస్డిసి ఎం.రామారావు, డిఆర్డీఏ డిపిఎం రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam